Big Boss OTT : బిగ్ బాస్ ప్రియుల‌కు ఖుష్ క‌బ‌ర్

ఇక 24 గంట‌ల పాటు స్ట్రీమింగ్

Big Boss OTT : తెలుగు బుల్లి తెర‌పై బిగ్ బాస్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అన్ని ప్రాంతీయ భాష‌ల్లో దుమ్ము రేపుతోంది. హిందీ, త‌మిళ‌లంలో కంటే తెలుగు బిగ్ బాస్ షో రేటింగ్ లో దూసుకు పోయింది.

ఇటీవ‌ల సీజ‌న్ -5 ముగిసింది. ఈ సంద‌ర్భంగా హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన నాగార్జున

ఈ నెల‌లో మ‌ళ్లీ బిగ్ బాస్(Big Boss OTT) ఉంటుంంద‌ని డిక్లేర్ చేసి విస్తు పోయేలా చేశాడు. ఇక నాగ్ చెప్పిన‌ట్టుగానే ఇవాళ ఖుష్ క‌బ‌ర్ చెప్పాడు.

ఈ మేర‌కు అప్ డేట్ కూడా వ‌చ్చేసింది. బిగ్ బాస్ ప్రియుల‌కు ఆనందం క‌లిగించే వార్త కూడా.

ప్ర‌స్తుతం ఓటీటీ ద్వారా బిగ్ బాస్ స్టార్ట్ కానుంది. ఇక పై ఒక టైంకు బందీ కాకుండా 24 గంట‌ల పాటు షోను వీక్షించేందుకు వీలు క‌లుగుతుంది.

ఈ మేర‌కు ఓటీటీ లోగో రిలీజ్ చేశారు. ప్రోమో విడుద‌ల చేసి స‌ర్ ప్రైజ్ ఇచ్చారు మేక‌ర్స్.

బిగ్ బాస్ ఓటీటీ (Big Boss OTT)ప్రారంభం కాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇక నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లు ట్వీట్ చేసింది.

అధికారికంగా వెల్ల‌డించింది. ప్రోమోను కూడా విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం నెట్టింట్లో ఓటీటీ బిగ్ బాస్ ప్రోమో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

పాత కంటెస్టెంట్స్ తో పాటు కొత్త వారు కూడా ఉన్నార‌ని టాక్.

విచిత్రం ఏమిటంటే ఈ బిగ్ బాస్ లో వెన్నెల కిషోర్ , నాగార్జున పోస్ట‌ర్ ఆక‌ట్టుకునేలా ఉంది. దీనికి బిగ్ బాస్ నాన్ స్టాప్ కు స్వాగ‌తం అంటూ ప‌లికారు.

ఇదిలా ఉండ‌గా ఓ ఖైదీకి ఉరి శిక్ష ప‌డ‌గా అత‌డి చివ‌రి కోరిక ఏమిటంటే బిగ్ బాస్ కు సంబంధించి ఒక్క ఎపిసోడ్ చూడాల‌ని అనుకుంటాడు.

అత‌డి కోరిక మేర‌కు స్ట్రీమింగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఫ‌న్నీగా.

Also Read : మ‌తి పోగొడుతున్న ‘క‌ళావ‌తి’

Leave A Reply

Your Email Id will not be published!