Rahul Gandhi : ఇమేజ్ చెరిపేసేందుకు కోట్లు ఖ‌ర్చు – రాహుల్

బీజేపీపై నిప్పులు చెరిగిన యువ నేత

Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. త‌న ఇమేజ్ చెరిపి వేసేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసింద‌ని మండిప‌డ్డారు. జ‌మ్మూ కాశ్మీర్ లో రాహుల్ గాంధీ(Rahul Gandhi)  మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. త‌న‌ను ప‌ప్పు అని ఎద్దేవా చేశారు.

ఎవ‌రు మూర్ఖులో ఈ దేశానికి తెలిసి పోయింద‌ని ఎద్దేవా చేశారు. పొద్ద‌స్త‌మానం ద్వేష పూరిత రాజ‌కీయాలు చేయ‌డం వ‌ల్ల ఒరిగేది ఏమీ ఉండ‌ద‌న్నారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నం చేకూరుతుందేమో కానీ భ‌విష్య‌త్తులో దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్ర‌మాదం ఉంద‌న్నారు. త‌న‌ను ఎన్ని ర‌కాలుగా విమ‌ర్శించినా లేదా ఎద్దేవా చేసినా తాను ఏమీ అనుకోన‌ని అన్నారు.

ఈ దేశంలో స‌త్యం ప‌ని చేస్తుంద‌న్నారు. డ‌బ్బు, అహంకారం, అధికారం కానే కాద‌ని తేల్చి చెప్పారు. ఈ విష‌యం భార‌తీయ జ‌న‌తా పార్టీ, దాని అనుబంధ సంస్థ‌లు తెలుసుకుంటే మంచిద‌న్నారు రాహుల్ గాంధీ. నా ప్ర‌తిష్ట‌ను వ‌క్రీక‌రించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ క్ర‌మప‌ద్ద‌తిలో వేల కోట్లు కురిపిస్తున్నాయంటూ ఆరోపించారు కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు.

ఏదో ఒక రోజు వాస్త‌వం బ‌య‌ట ప‌డ‌క త‌ప్ప‌ద‌న్నారు. మీరు ఏమైనా చేయొచ్చు.. డ‌బ్బుల‌తో దేనినైనా కొనుగోలు చేయ‌గ‌ల‌రు..లేదా కూల్చ‌గ‌ల‌రు..ప‌వ‌ర్ లోకి రాగ‌ల‌రు..కానీ స‌త్యాన్ని దాచ లేరు..నిజాన్ని కొనలేర‌ని స్ప‌ష్టం చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) .తాను చెప్పిన ఈ క‌ఠోర స‌త్యం త్వ‌ర‌లోనే బీజేపీ, కాషాయ శ్రేణుల‌కు అర్థం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ వ్యాఖ్య‌లు స‌రికాదు

Leave A Reply

Your Email Id will not be published!