Syed Zafar Islam : అవినీతిమ‌యం త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం

బీజేపీ అధికార ప్ర‌తినిధి స‌య్య‌ద్ జాఫ‌ర్ ఇస్లాం

Syed Zafar Islam : భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి స‌య్య‌ద్ జాఫ‌ర్ ఇస్లాం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మిళనాడు ప్ర‌భుత్వం అవినీతిమ‌యంగా మారింద‌ని ఆరోపించారు. అధికారంలో ఉన్న డీఎంకే మ‌నీలాండ‌రింగ్ , అన్యాయ‌మైన ప‌ద్ద‌తుల ద్వారా సంపాదించిన డ‌బ్బుల‌ను దాచేందుకు ప్ర‌య‌త్నం చేస్తోందంటూ మండిప‌డ్డారు. చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టుపై వివ‌క్ష ప్ర‌ద‌ర్శిస్తోంద‌న్నారు. ఇందుకు సంబంధించి డీఎంకే ఫైల్స్ ఉన్నాయంటూ స‌య్య‌ద్ జాఫార్ ఇస్లాం ఎద్దేవా చేశారు.

త‌మిళ‌నాడు లోని సీఎం ఎంకే స్టాలిన్ ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని అవినీతితో విష పూరితం చేస్తోంద‌ని ఆరోపించారు. చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టులో అవ‌క‌త‌వ‌క‌లు ఆరోప‌ణ‌ల‌పై సీబీఐ విచార‌ణ కోర‌నున్న‌ట్లు తెలిపారు. శ‌నివారం స‌య్య‌ద్ జాఫ‌ర్ ఇస్లాం మీడియాతో మాట్లాడారు. పెద్ద ఎత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారంటూ విమ‌ర్శించారు. డ‌బ్బుల‌ను దాచేందుకు సిగ్గు మాలిన ప్ర‌య‌త్నాలు చేస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు.

త‌మిళ‌నాడు గొప్ప సంస్కృతి, గొప్ప వార‌స‌త్వం క‌లిగిన రాష్ట్రం కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు డీఎంకే స‌ర్కార్ ఈ రాష్ట్రాన్ని అవినీతితో విష‌పూరితం చేస్తోంద‌న్నారు ఇస్లాం(Syed Zafar Islam). స్టాలిన్ కుమారుడు మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ , అల్లుడు వి.శ‌బ‌రీశ‌న్ క‌లిసి ఏడాది వ్య‌వ‌ధిలో రూ. 30,000 కోట్లు సంపాదించార‌ని ఆరోపించారు. ఇదే విష‌యం మంత్రి త్యాగ రాజ‌న్ చెప్పారంటూ పేర్కొన్నారు.

Also Read : హ‌క్కుల కార్య‌క‌ర్త ర‌షీదా కాల్చివేత‌

Leave A Reply

Your Email Id will not be published!