Buggana Rajendranath Reddy : టీడీపీ కామెంట్స్ బుగ్గ‌న సీరియ‌స్

ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు

Buggana Rajendranath Reddy : ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయ‌న తెలుగు దేశం పార్టీ పై విరుచుకు ప‌డ్డారు. అర్థం ప‌ర్థం లేకుండా ఆధారాలు లేకుండా మాట్లాడ‌టం ఆ పార్టీ నేత‌ల‌కు అల‌వాటుగా మారిందంటూ మండిప‌డ్డారు.

శ‌నివారం బుగ్గ‌న మీడియాతో మాట్లాడారు. దావోస్ లో జ‌రిగే ప్ర‌పంచ ఎక‌నామిక్ ఫోరంలో పాల్గొనేందుకు సీఎం జ‌గ‌న్ రెడ్డి వెళ్లార‌ని చెప్పారు. ప్ర‌ధానంగా టీడీపీ, ఎల్లో మీడియాకు ప్ర‌తిదీ ప‌చ్చ‌గానే క‌నిపిస్తోందంటూ ఎద్దేవా చేశారు.

సీఎం టూర్ పై మాజీ ఆర్థిక శాఖ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు చేసిన ఆరోప‌ణ‌లు స్థాయికి త‌గ్గిన‌ట్టుగా లేవ‌న్నారు. వ‌య‌సు మీద ప‌డుతున్న కొద్దీ ఆయ‌న ఏం మాట్లాడుతున్నారో తెలియ‌డం లేద‌న్నారు.

ఎదుటి వ్య‌క్తుల గురించి మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడాల‌న్న ఇంకిత జ్ఞానం కోల్పోవ‌డం దారుణ‌మ‌న్నారు బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి(Buggana Rajendranath Reddy). గ‌తంలో ప్ర‌భుత్వంలో ప‌ని చేసిన వారికి అంతర్జాతీయ నియ‌మాలు, రూల్స్ , త‌దిత‌ర అంశాల గురించి అవ‌గాహ‌న లేక పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.

సీఎం జ‌గ‌న్ పై, ఆయ‌న కుటుంబంపై అవాకులు పేల‌డం అల‌వాటుగా మారింద‌న్నారు. ఇప్ప‌టికే టీడీపీని ప్ర‌జ‌లు ఛీ కొట్టార‌ని అయినా బుద్ది రావ‌డం లేద‌న్నారు. సీఎం జ‌గ‌న్ టూర్ ర‌హ‌స్యం ఏమీ కాద‌ని స్ప‌ష్టం చేశారు.

కుటుంబీల‌తో క‌లిసి దావోస్ చేరుకుంటార‌న్న దాంట్లో ఎందుకు అనుమానం ఉండాల‌న్నారు. టీడీపీ నేత‌లు దిగ‌జారి పోవ‌డంలో మ‌రో మైలు రాయిని చేరుకున్నారంటూ బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి(Buggana Rajendranath Reddy) ఎద్దేవా చేశారు.

 

Also Read : అఖిలేష్ తో సీఎం కేసీఆర్ భేటీ

Leave A Reply

Your Email Id will not be published!