Chandrababu Congrats : అద్భుత‌ విజ‌యం బాబు ఉత్సాహం

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో విజ‌యం

Chandrababu Congrats : ఏపీలో జ‌రిగిన గ్రాడ్యూయేట్ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్య‌ర్థులు ఘ‌న విజ‌యాన్ని సాధించారు. ఈ అనూహ్య గెలుపుతో టీడీపీలో సంబురాలు మిన్నంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా విజ‌యోత్స‌వాల‌లో మునిగి పోయారు పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, శ్రేణులు. ఒక ర‌కంగా అధికార పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

175 స్థానాల‌లో ఈసారి గెల‌వాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు జ‌గ‌న్ రెడ్డి. ఈ మేర‌కు కీల‌క ఆదేశాలు కూడా జారీ చేశారు. అన్నీ తానే అయి వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు. ప్ర‌తి జిల్లాకు ఒక‌రిని ఇంఛార్జ్ గా నియ‌మించారు. త్వ‌ర‌లోనే విశాఖ నుంచే తాను పాల‌న సాగిస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఈ సమ‌యంలో యువ‌త ఓట్లు ఎక్కువ‌గా ఉన్నాయి. కానీ అనూహ్యంగా మూడు సీట్ల‌కు మూడు కూడా టీడీపీ వ‌శం కావ‌డం ఒకింత అధికార పార్టీలో ఒకింత క‌ల‌వ‌రానికి గురి చేసింద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇక తెలుగుదేశం పార్టీలో సంతోషం అంబ‌రాన్ని అంటింది. ట‌పాసులు కాల్చుతూ , మిఠాయిలు పంచారు. ఇప్ప‌టికే ఉత్త‌ర , ఆంధ్ర , తూర్పు రాయ‌ల‌సీమ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొంద‌గా తాజాగా ప‌శ్చిమ రాయ‌ల‌సీమలో కూడా టీడీపీ అభ్య‌ర్థి రామ గోపాల్ రెడ్డి విజ‌యం సాధించారు.

ఆయ‌న తాజాగా డిక్ల‌రేష‌న్ ఫామ్ కూడా అందుకున్నారు. వెన్నపూస ర‌వీంద్రారెడ్డిపై గెలుపొందారు. తూర్పు రాయ‌ల‌సీమ లో కంచ‌ర్ల శ్రీ‌కాంత్ విజ‌యం సాధించారు. ఉత్త‌రాంధ్ర స్థానంలో టీడీపీ అభ్య‌ర్థి చిరంజీవి రావు విక్ట‌రీ సాధించారు. ఈ సంద‌ర్బంగా గెలుపొందిన ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను అభినందించారు టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Congrats) .

Also Read : తెలుగుదేశం విజ‌యోత్స‌వం

Leave A Reply

Your Email Id will not be published!