Chandrababu Naidu : ఏపీలో ఇక జ‌గ‌న్ ఆట‌లు సాగ‌వు

రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంది

Chandrababu Naidu : ఏపీలో రాచ‌రిక పాల‌న సాగుతోంది. ప్ర‌తిప‌క్షాల‌పై దాడులు పెరిగాయి. ర‌క్ష‌ణ లేకుండా పోతోంది. అధికార మ‌దంతో వైసీపీ శ్రేణులు దాడుల‌కు పాల్ప‌డుతున్నాయి. ఇది ఎంత మాత్రం సాగ‌దు. ఎమ్మెల్యేల అండ చూసుకుని జ‌గ‌న్ రెడ్డి రెచ్చి పోతున్నారంటూ మండిప‌డ్డారు టీడీపీ చీఫ్‌, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu).

రాష్ట్రంలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల‌న్నారు. అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతూ ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్న జ‌గ‌న్ కు ప్ర‌జ‌లు బుద్ది చెప్పాల‌ని పిలుపునిచ్చారు. త‌న‌పై ఎన్ని దాడులు చేసినా తాను బెదిరే ప్ర‌స‌క్తి లేద‌ని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణించాయ‌ని, ప్ర‌జ‌లు ప్ర‌శాంతంగా బ‌తికే ప‌రిస్థితులు లేవ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన ఘ‌న‌త ఏపీ సీఎంకు ద‌క్కుతుంద‌ని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. ఈ పాల‌న‌ను ఇలాగే భ‌రిస్తూ పోస్తే చివ‌ర‌కు రాష్ట్రాన్ని వ‌ల్ల‌కాడుగా మార్చేస్తారంటూ హెచ్చ‌రించారు.

ఇక‌నైనా ప్ర‌జ‌లు మేలుకోవాల‌ని లేక పోతే న‌ష్ట పోయేది మీరేన‌ని స్ప‌ష్టం చేశారు టీడీపీ చీఫ్‌. ఎన్టీఆర్ జిల్లా నందిగామ‌లో చేప‌ట్టిన రోడ్ షోలో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌సంగించారు. కేసులు పెడుతూ పోతే భ‌య‌ప‌డ‌తామ‌ని అనుకుంటున్నారు. కానీ టీడీపీ చ‌రిత్ర‌లో ఎవ‌రూ భ‌య‌ప‌డిన దాఖ‌లాలు లేవ‌న్నారు.

మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడిపై త‌ప్పుడు కేసు పెడితే ఏమైందో చూశార‌ని అయినా సీఎంకు బుద్ది రాలేద‌న్నారు చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu).

ఇప్ప‌టికే హైకోర్టు ప‌లుమార్లు మొట్టికాయ‌లు వేసింద‌ని అయినా మార్పు రాలేద‌న్నారు చంద్ర‌బాబు నాయుడు.

Also Read : ఇళ్ల‌ను కూల్చేస్తే స‌ర్కార్ కూలుతుంది

Leave A Reply

Your Email Id will not be published!