Jammu Kashmir : జ‌మ్మూ కాశ్మీర్ లో స్థానికేత‌ర ఓట‌ర్ల‌పై క్లారిటీ 

ప్ర‌క‌ట‌న జారీ చేసిన జ‌మ్మూ కాశ్మీర్ పాల‌నా విభాగం 

Jammu Kashmir :  జ‌మ్మూ కాశ్మీర్ లో ఓట‌ర్ల జాబితాలో(Jammu Kashmir) స‌వ‌ర‌ణ త‌ర్వాత దాదాపు 25 ల‌క్ష‌ల మందికి పైగా స్థానికేత‌రులు ఓట‌ర్లుగా చేరే అవకాశం ఉంద‌ని చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

దీనిపై తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయి. భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ప్ప మిగ‌తా పార్టీల‌న్నీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. స్థానికేత‌రుల ఓట‌ర్ల‌తో బీజేపీ రాబోయే ఎన్నిక‌ల్లో ల‌బ్ది  పొందాల‌ని అనుకుంటోందంటూ ఆరోపించాయి.

ఇందుకు సంబంధించి ప్ర‌భుత్వంతో స‌న్నిహితంగా భావించే పార్టీల‌తో స‌హా రాజ‌కీయంగా ఎదురు దెబ్బ‌లు త‌గిలిన త‌ర్వాత స్థానిక ప‌త్రిక‌ల్లో స్ప‌ష్టత ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది ప‌రిపాల‌న శాఖ‌.

ఈ అంశంపై నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ చీఫ్ ఫ‌రూక్ అబ్దుల్లా అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత మొద‌టిసారిగా ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ‌కు శ్రీ‌కారం చుట్టింది.

పెద్ద ఎత్తున యువ‌కులు ఓట‌ర్లుగా న‌మోదు చేసే అవ‌కాశం ఉంద‌ని జ‌మ్మూ కాశ్మీర్ చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ (సిఇఓ) హిర్దేష్ కుమార్ వెల్ల‌డించారు.

గ‌త మూడు సంవ‌త్స‌రాల‌లో పెద్ద సంఖ్య‌లో యువ‌కులు 18 ఏళ్లు నిండిన కార‌ణంగా ఓట‌రు జాబితాలో భారీ మార్పులు చేయాల‌ని తాము భావిస్తున్న‌ట్లు తెలిపారు.

ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత  ఓట‌ర్లుగా న‌మోదు చేసుకోని చాలా మంది వ్య‌క్తులు ఇప్పుడు ఓటు వేసేందుకు అర్హులని పేర్కొన్నారు.

సాధార‌ణంగా జీవిస్తున్న ఎవ‌రైనా రూల్స్ ప్ర‌కారం ఓట‌రుగా న‌మోదు చేసుకోవ‌చ్చన్నారు. జ‌మ్మూ కాశ్మీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు కొత్త‌గా న‌మోదైన వారితో క‌లిపి 76 ల‌క్ష‌ల‌కు చేరుకుంది.

Also Read : మ‌తం పేరుతో బ్రాహ్మ‌ణులు మోసం

Leave A Reply

Your Email Id will not be published!