CM Chandrababu : టీడీపీ నాయకులు అన్నే రామకృష్ణ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం, మినిస్టర్స్

CM Chandrababu : ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత అన్నే రామకృష్ణ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన కీలకమైన ఓటరు వెరిఫికేషన్ విభాగంలో రామకృష్ణ సమర్థవంతంగా పనిచేశారని, ఓటరు వెరిఫికేషన్‌లో మంచి అనుభవం ఉన్న ఆయనను అందరూ ఓటర్ రామకృష్ణ అని పిలిచేవారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

CM Chandrababu Comment

చంద్రబాబు ఓటరు రామకృష్ణగా పేరొందిన టీడీపీ నేత అన్నే రామకృష్ణ ఆకస్మిక మృతి తీవ్ర దిగ్భ్రాంతిని మిగిల్చిందని, టీడీపీ కోసం అహర్నిశలు శ్రమించిన ఓటరు రామకృష్ణ అన్నకు కన్నీటి నివాళులు అర్పిస్తున్నట్లు విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. టీడీపీకి చెందిన ఓటరు వెరిఫికేషన్ విభాగానికి తాను ఎంతో కృషి చేశానని, ఓటరు రామకృష్ణ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.

Also Read : MLA Harish Rao : ప్రభుత్వం పంతాలకు, పట్టింపులకు పోకుండా రైతులకు అండగా ఉండాలి

Leave A Reply

Your Email Id will not be published!