CM Chandrababu : బద్వేల్-నెల్లూరు 4 లేన్ కారిడార్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ఇది ఏపీకి గుడ్ న్యూస్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు...
CM Chandrababu : నెల్లూరు-బద్వేలు కారిడార్ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహరాల కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్ర కేబినెట్ 4 లైన్ బద్వేలు- నెల్లూరు కారిడార్కు ఆమోద ముద్ర వేయడం ఏపీ అభివృద్ధిలో కీలక ముందడుగు అని అన్నారు. స్థానికంగా కనెక్టివిటీతో పాటు దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, కారిడార్ను మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సీఎం చంద్రబాబు సామాజిక మాద్యమం ఎక్స్లో ట్వీట్ చేస్తూ ప్రధాని ట్వీట్ను ట్యాగ్ చేశారు.
CM Chandrababu Key Comments
కాగా ఆంధ్రప్రదేశ్లోని దాదాపు 108 కిలోమీటర్లు పొడవైన నెల్లూరు-బద్వేలు కారిడార్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహరాల కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ ఆమోదం పొందిన 4 లేన్ల బద్వేల్-నెల్లూరు కారిడార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణానికి ప్రయోజనం చేకూరుస్తుందని, రాష్ట్ర యువతకు పలు అవకాశాలను సృష్టిస్తుందని, ఇది ఏపీకి గుడ్ న్యూస్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
ఆ నాలుగు వరుసల కారిడార్ను రూ.3,653 కోట్లతో నిర్మించబోతున్నారు. ఈ నాలుగు లేన్ల కారిడార్ వైఎస్సార్ కడప జిల్లాలోని గోపవరం నుంచి ప్రారంభమై నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు జంక్షన్ దగ్గర ముగుస్తుంది. చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద ప్రాధాన్య నోడ్గా గుర్తించిన కృష్ణపట్నం పోర్టుకు కనెక్టివిటీని అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న రహదారితో పోల్చుకుంటే ఈ కారిడార్ ద్వారా కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే దూరం 33.9 కిలోమీటర్ల మేర తగ్గుతుంది. ప్రయాణ సమయం దాదాపు గంట వరకు ఆదా అవుతుంది.
Also Read : BJP : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే విజయం