CM KCR : జనమే జెండా గెలుపే ఎజెండా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
CM KCR : సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా తెలంగాణలో ఎగరడం ఖాయమన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. అభివృద్దికి నమూనా తెలంగాణ అని యావత్ దేశం మన రాష్ట్రం వైపు చూస్తోందన్నారు.
CM KCR Comment
తనను ఆదరించి, అక్కున చేర్చుకున్న సిద్దిపేట అంటే తనకు వల్లమాలిన అభిమానం అని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేశామని స్పష్టం చేశారు కేసీఆర్(CM KCR).
జనమే జెండా ప్రజలే ఎజెండాగా తాము ముందు నుంచీ పని చేస్తూ వచ్చామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు మాయ మాటలతో జనాన్ని బురిడీ కొట్టించేందుకు ముందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. సిద్దిపేటలో జరిగిన సభలో సీఎం మాట్లాడారు.
ఎవరు ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చినా , జిమ్మిక్కులు చేసినా వర్కవుట్ కాదన్నారు. మరోసారి గెలిచేది తామేనని కుండ బద్దలు కొట్టారు సీఎం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు కేవలం అభివృద్ది మాత్రమేనని స్పష్టం చేశారు కేసీఆర్.
రాష్ట్రంలో గులాబీ జెండాను అడ్డుకునే శక్తి ఏ పార్టీకి లేదన్నారు.
Also Read : Power Cut : క్రికెట్ మ్యాచ్ కు పవర్ కట్