RK Roja : జ‌గ‌న్ ల‌క్ష్యం మ‌హిళా సంక్షేమం – రోజా

తెలుగుదేశం పార్టీపై సంచ‌ల‌న కామెంట్స్

RK Roja : ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా(RK Roja) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్యం మ‌హిళా సంక్షేమ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి ఆరోప‌ణ‌లు, విమ‌ర్శించ‌డం త‌ప్ప ఇంకొక‌టి తెలియ‌ద‌న్నారు.

మ‌హిళా సాధికార‌తే ధ్యేయంగా సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ని చేస్తున్నారంటూ తెలిపారు. తాడేప‌ల్లి గూడెంలో మంత్రి రోజా(RK Roja) మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థకాల‌లో 75 శాతానికి పైగా వాటా మ‌హిళ‌ల‌దే ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

స‌మాచారం తెలుసు కోకుండా విమ‌ర్శ‌లు చేయ‌డం టీడీపికి అల‌వాటుగా మారింద‌ని ఎద్దేవా చేశారు. జ‌గ‌న్ రెడ్డి మ‌హిళా సాధికార‌త దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని, అందులో భాగంగానే దిశ ను ప్ర‌వేశ పెట్ట‌డం జ‌రిగింద‌న్నారు.

త‌మ‌ది పూర్తిగా మ‌హిళా ప‌క్ష‌పాత ప్ర‌భుత్వ‌మ‌ని పేర్కొన్నారు. టీడీపీ మ‌హిళల‌కు ద్రోహం చేసిన పార్టీ అంటూ ధ్వ‌జ‌మెత్తారు. అన్ని రంగాల‌లో మ‌హిళల‌కు ప్ర‌యారిటీ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని చెప్పారు.

టీడీపీ ఎన్ని ర‌కాలుగా య‌త్నించినా జ‌గ‌న్ ఇమేజ్ డ్యామేజ్ కాద‌న్నారు. త‌మ సీఎం ఏది చెబితే అది చేస్తార‌ని వెన‌క్కి త‌గ్గ‌ని, మ‌డ‌మ తిప్పని వంశ‌మ‌న్నారు ఆర్కే రోజా.

అంతే కాకుండా దిశ పోలీస్ స్టేష‌న్ల‌ను పార్ల‌మెంట్ స్టాండింగ్ క‌మిటీ ప్ర‌శంసించింద‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

త‌మ సీఎం మ‌హిళా సాధికార‌త‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ అంటూ కొనియాడారు. చంద్ర‌బాబు ఎందుకు నిర‌స‌న‌లు తెలియ చేస్తున్నారో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని డిమాండ్ చేశారు ఆర్కే రోజా.

Also Read : టిక్కెట్ ఇస్తే వ‌స్తామంటున్నవైసిపి సీనియ‌ర్లు

Leave A Reply

Your Email Id will not be published!