Daggubati Purandeswari : మద్యంపై ఏపీ సర్కార్ కాకి లెక్కలు
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి
Daggubati Purandeswari : అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari) దేవి నిప్పులు చెరిగారు. ఆమె పదే పదే రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం గురించి ప్రస్తావిస్తున్నారు. దీనికి ప్రధాన కారకుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.
Daggubati Purandeswari Slams YS Jagan
ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రోజు రోజుకు మద్యం అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయని, పేదలు తమ ఆరోగ్యాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిశీలనలో చూస్తే రాష్ట్రంలో రోజుకు 34.5 శాతానికి పైగా మద్యం సేవిస్తున్నారని తేలిందన్నారు దగ్గుబాటి పురందేశ్వరి.
మద్యానికి సంబంధించి తాము లేవనెత్తిన ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితిలో ఏపీ సర్కార్ ఉందన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందంటూ ధ్వజమెత్తారు దగ్గుబాటి పురుందేశ్వరి.
మద్యం కంపెనీల యజమానుల పేర్లను ప్రజా క్షేత్రంలో ఎందుకు బయట పెట్టడం లేదంటూ ప్రశ్నించారు. ఏపీలో డిజిటల్ పేమెంట్లను ఎందుకు ప్రోత్సహించడం లేదంటూ నిలదీశారు. నాసిరకం మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యంపై అమిత్ షా ఆరా తీశారని చెప్పారు.
Also Read : Undavalli Arun Kumar : ఉండవల్లి సంచలన కామెంట్స్