Damodar Raja Narasimha : పార్టీలో పుట్టినం కాంగ్రెస్ కోసం చ‌స్తం

దామోద‌ర్ రాజ న‌ర్సింహ్మ కామెంట్

Damodar Raja Narasimha : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, మాజీ డిప్యూటీ సీఎం దామోద‌ర రాజ న‌ర్సింహ్మ(Damodar Raja Narasimha) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క నివాసంలో సీనియ‌ర్ నాయ‌కులు మ‌ధు యాష్కి గౌడ్ , ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, జ‌గ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల టీపీసీసీలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఈ సంద‌ర్భంగా దామోద‌ర్ రాజ న‌ర్సింహ్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న కుటుంబం 50 ఏళ్ల‌కు పైగా కాంగ్రెస్ పార్టీలో ఉంద‌న్నారు. తాను 36 ఏళ్లుగా పార్టీలో ఉన్నాన‌ని తాను ఇక్క‌డే పుట్టాన‌ని ఇందులోనే చ‌స్తాన‌ని అన్నారు. ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. ఈ విష‌యాన్ని హైక‌మాండ్ దృష్టికి తీసుకు వెళ‌తామ‌ని చెప్పారు.

ఇక నుంచి సేవ్ కాంగ్రెస్ పేరుతో తాము కార్య‌క్ర‌మాల‌తో ముందుకు వెళ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల ప్ర‌క‌టించిన జాబితాలో స‌గానికి పైగా కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స వ‌చ్చిన వారికే ప్ర‌యారిటీ ఇచ్చారంటూ ఆరోపించారు. ప్ర‌ధానంగా సీనియ‌ర్ నేత‌లు ప్ర‌ధానంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు.

గ‌తంలో కొన్నేళ్లుగా పార్టీనే అంటి పెట్టుకుని ప‌ని చేస్తున్న వారిని ప‌ట్టించు కోలేద‌న్నారు మ‌ధు యాష్కి గౌడ్. ఇవాళ వ‌ల‌స వ‌చ్చిన వాళ్లు పార్టీని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. విచిత్రం ఏమిటంటే త‌మ పార్టీకి చెందిన వార్ రూమ్ లో త‌మ‌పై కూడా వ్య‌తిరేకంగా పోస్టులు షేర్స్ చేస్తుండ‌డం త‌నను విస్తు పోయేలా చేసింద‌న్నారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.

త‌మ‌ను కావాల‌ని టార్గెట్ చేస్తున్నార‌ని, అస‌మ్మ‌తి నేత‌లు అంటూ, కోవ‌ర్టులంటూ త‌మ‌పై బ‌ద్నాం చేస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు జ‌గ్గారెడ్డి.

Also Read : హైద‌రాబాద్ టెక్ హ‌బ్ నా పుణ్య‌మే

Leave A Reply

Your Email Id will not be published!