Divya Vani : టీడీపీకి మంగ‌ళం బాబుపై ఆగ్ర‌హం

దివ్య వాణి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Divya Vani : తెలుగుదేశం పార్టీ నుంచి తాను త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీనియ‌ర్ న‌టి, మాజీ నాయ‌కురాలు దివ్య‌వాణి. ఆ పార్టీపై తీవ్ర , సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

దివ్య‌వాణి గురువారం విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు. ఆమె కంట‌త‌డి పెట్టారు. త‌న‌కు తీవ్రంగా అన్యాయం జ‌రిగింద‌ని వాపోయారు. ఉద్యోగానికి లోన‌య్యారు.

గ‌త కొంత కాలంగా పార్టీలో చేరిన నాటి నుంచి త‌గిన ప్రాధాన్య‌త ఇవ్వ లేద‌ని ఆరోపించారు. ఇదంతా గ‌త ఏడాది నుంచి త‌న‌కు జ‌రుగుతూ వ‌స్తోంద‌ని వాపోయారు.

కొంద‌రు బుద్ది లేని నాయ‌కులు త‌న‌ను అన‌రాని మాట‌లు అన్నారంటూ ఆవేద‌న చెందారు. త‌న‌కు ప్యాకేజీ అందిందంటూ ఆరోప‌ణ‌లు చేశార‌ని ఇది వాస్త‌వం కాద‌న్నారు.

తాను ఎవ‌రికీ వంత పాడ లేద‌ని, ఎవ‌రికి స‌పోర్ట్ చేయ‌లేద‌న్నారు. పార్టీలో ఏం జ‌రుగుతుందో ఉన్న‌ది ఉన్న‌ట్లు ఇప్ప‌టి వ‌రకు చెప్పాన‌న్నారు.

త‌న‌కు జ‌రిగిన అన్యాయం గురించి పార్టీ చీఫ్ కు, లోకేష్ బాబుకు తెలియ చేశాన‌ని చెప్పారు దివ్య‌వాణి. లోకేష్ జ‌నార్ద‌న్ కు చెప్పార‌ని తెలిపారు. ఇదిలా ఉండ‌గా ఆమె కొందరిపై తీవ్రంగా మండిప‌డ్డారు.

జ‌ర్న‌లిజం పేరుతో నానా మాట‌లు అన్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చివ‌రి నిమిషం దాకా తాను ఆగాన‌ని, కానీ ఇలాంటి రోజు త‌న‌కు వ‌స్తుంద‌ని క‌ల‌లో కూడా అనుకోలేద‌ని చెప్పారు దివ్య‌వాణి(Divya Vani).

చంద్ర‌బాబు నాయుడిపై నిప్పులు చెరిగారు. ద‌మ్ముంటే గుండె మీద చేయి వేసి చెప్పాల‌న్నారు. జ‌నార్ద‌న్ అనే వ్య‌క్తిని ప్ర‌శ్నించినందుకు త‌న‌ను టార్గెట్ చేశారంటూ క‌న్నీటి ప‌ర్యంతం చేశారు.

Also Read : నా తెలంగాణ కోటి ర‌త‌ణాల వీణ

Leave A Reply

Your Email Id will not be published!