Kodali Nani : చిచ్చు పెట్టాల‌ని చూస్తే చిత్తు చేస్తారు – కొడాలి

టీడీపీపై నిప్పులు చెరిగిన వైసీపీ మాజీ మంత్రి

Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నాని మ‌రోసారి నిప్పులు చెరిగారు. టీడీపీ చీఫ్ చంద్ర‌బాబుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కులాలు, మ‌తాల పేరుతో చిచ్చు పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారంటూ కొడాలి నాని ఆరోపించారు.

తండ్రీ కొడుకుల‌కు ప్ర‌జ‌లు ఛీ కొట్టినా బుద్ది రావ‌డం లేద‌ని మండిప‌డ్డారు. తాడేప‌ల్లి గూడెంలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాల‌యంలో కొడాలి నాని(Kodali Nani) బుధ‌వారం మీడియాతో మాట్లాడారు. కుట్ర‌లు, కుతంత్రాలు త‌ప్ప చంద్ర‌బాబుకు ఇంకేమీ తెలియ‌ద‌న్నారు.

ఏమైనా అంటే 40 ఏళ్ల అనుభ‌వం అంటాడ‌ని ఎద్దేవా చేశారు. జ‌గ‌న్ సార‌థ్యంలోని ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి త‌ట్టుకోలేక పోతున్నాడ‌ని ఫైర్ అయ్యారు.

ప్ర‌భుత్వాన్ని అప్ర‌తిష్ట‌పాలు చేయాల‌ని ఆధారాలు లేని ఆరోప‌ణ‌లు చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు కొడాలి నాని. మ‌తాల మ‌ధ్య చిచ్చు పెట్టేందుకు ర‌థాల‌ను త‌గుల బెట్ట‌డం, విగ్ర‌హాల‌ను ధ్వంసం చేయ‌డం ఇదే ప‌నిగా పెట్టుకున్నార‌ని కానీ జ‌నం చంద్ర బాబు నైజం ఏమిటో క‌నుక్కున్నార‌ని అందుకే క‌ర్ర కాల్చి వాత పెట్టార‌ని అన్నారు.

ఇప్ప‌టికే టీడీపీని నామ రూపాలు లేకుండా చేశార‌ని చెప్పారు కొడాలి నాని(Kodali Nani) . గ‌తంలో ఆయ‌న ప‌చ్చ మీడియా కోడై కూసింది చివ‌ర‌కు త‌ప్ప‌ని తేలింద‌న్నారు.

ఇప్పుడు కొత్త‌గా మ‌ద్యంలో విషం అంటూ ప్ర‌చారం మొద‌లు పెట్టార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చారిట‌బుల్ ట్ర‌స్ట్ పెట్టి ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తున్న వారిని బినామీలు అంటారా అంటూ మండిప‌డ్డారు కొడాలి నాని.

రామోజీరావు చెబితే రాష్ట్రం అంతా మారిపోతుంద‌న్న భ్ర‌మ‌లో చంద్ర‌బాబు ఉన్నాడ‌ని ఎద్దేవా చేశారు. జ‌గ‌న్ ను ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌న్నారు కొడాలి నాని.

Also Read : న‌న్ను ఓడించే స‌త్తా బాబుకు లేదు

Leave A Reply

Your Email Id will not be published!