Ajay Mishra : రాకేశ్ టికాయ‌త్ మొరిగితే నాకేం కాదు – మిశ్రా

నోరు పారేసుకున్న కేంద్ర మంత్రి

Ajay Mishra : సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నేత రాకేశ్ టికాయ‌త్ పై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా. రైతుల‌ను చంపిన కేసులో కేంద్ర మంత్రితో పాటు కొడుకు ఆశిష్ మిశ్రా తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.

మ‌రో వైపు త‌న‌యుడు మిశ్రా ప్ర‌స్తుతం జైలులో ఉన్నారు. బెయిల్ దొర‌క‌డం లేదు. ఈ త‌రుణంలో కేంద్ర మంత్రిని కేబినెట్ నుండి తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వ‌ర్యంలో వేలాది మంది రైతులు యూపీలోని ల‌ఖింపూరి ఖేరిలో 72 గంట‌ల పాటు దీక్ష చేప‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు రైతు అగ్ర నాయ‌కుడు రాకేశ్ టికాయ‌త్. రాకేశ్ టికాయ‌త్ చేసిన ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌ని మండిప‌డ్డారు కేంద్ర మంత్రి.

మీడియా , సోకాల్డ్ రైతులు, జాతీయేత‌ర రాజ‌కీయ పార్టీలు లేదా కెన‌డా లేదా పాకిస్తాన్ లో కూర్చున్న ఉగ్ర‌వాదులు మీరు న‌న్ను పాపుల‌ర్ చేస్తాన‌ని అనుకోలేద‌న్నారు అజ‌య్ మిశ్రా(Ajay Mishra).

ఇదే మీ బ‌లం.. మీ వ‌ల్ల ఈ వ్య‌క్తులు గుర్తించ లేరు. న‌న్ను ఓడించాల‌ని అనుకున్నారు. కానీ నేను గెలిచి చూపించాన‌ని ఎద్దేవా చేశారు. నేను ల‌క్నోకి కారులో ప్ర‌యాణం చేస్తున్నా.

వేగంతో వెళుతోంది. కుక్క‌లు మొరుగుతాయి. అవి రోడ్డు ప‌క్కనే ఉంటాయ‌న్నారు. మొర‌గ‌డం వారి స్వ‌భావం. దాని గురించి నేనేమీ చెప్ప‌న‌న్నారు అజ‌య్ మిశ్రా.

మీ మ‌ద్ద‌తు వ‌ల్ల తాను చాలా బాగానే ఉన్నాన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఎంత మంది రాకేశ్ టికాయ‌త్ లు వ‌చ్చినా న‌న్ను ఏమీ చేయ‌లేర‌న్నారు. రెండు ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడి పోయాడంటూ ఎద్దేవా చేశారు.

Also Read : బీజేపీ ఆఫ‌ర్ ఆడియో రెడీగా ఉంది

Leave A Reply

Your Email Id will not be published!