G Kishan Reddy : కేసీఆర్ స‌ర్కార్ అవినీతిపై విచార‌ణ

సుప్రీంకోర్టు రిటైర్డు జ‌డ్జితో ఏర్పాటు

G Kishan Reddy : హైద‌రాబాద్ – బీజేపీ స్టేట్ చీఫ్ , కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో బ‌హుజ‌నులు త‌మ వెంటే ఉన్నార‌ని అన్నారు. ఇవాళ కేవ‌లం బీఆర్ఎస్ , బీజేపీ మ‌ధ్య‌నే పోటీ ఉంద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ బ‌లుపు చూసుకుని వాపు అనుకుంటోంద‌ని ఎద్దేవా చేశారు. కిష‌న్ రెడ్డి సోమ‌వారం మీడియాతో మాట్లాడారు.

G Kishan Reddy Shocking Comments

తాను రెడ్డిన‌ని , కానీ బీజేపీ ప‌ద‌వికి రెడ్డిని ప్ర‌క‌టించిన త‌ర్వాత కూడా బీసీని సీఎం చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ఏకైక పార్టీ బీజేపీన‌ని ఆ విష‌యం మ‌రిచి పోవ‌ద్ద‌ని పేర్కొన్నారు. ఇది అస‌లైన సామాజిక న్యాయానికి ప్ర‌తీక అని పేర్కొన్నారు. రిజ‌ర్వేష‌న్ ప‌రిధిలో రాని వారికి కూడా రిజ‌ర్వేష‌న్ క‌ల్పించిన ఘ‌న‌త ఒక్క పీఎం మోదీకే ద‌క్కుతుంద‌న్నారు.

కేసీఆర్ స‌ర్కార్ అవినీతి పెచ్చ‌రిల్లి పోయింద‌ని, దానిని అడ్డుకునే స‌త్తా ఒక్క త‌మ‌కే ఉంద‌న్నారు కిష‌న్ రెడ్డి(G Kishan Reddy). ఈ మొత్తం తొమ్మిదిన్న‌ర ఏళ్ల కాలంలో అంతులేని అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని ఈ మొత్తం వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపిస్తామ‌ని ప్ర‌క‌టించారు గంగాపురం కిష‌న్ రెడ్డి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తామ నిర్ణ‌యాత్మ‌క పాత్ర పోషించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

Also Read : RS Praveen Kumar : జ‌గ‌దీశ్ రెడ్డి ప్రోద్భ‌లంతోనే దాడి

Leave A Reply

Your Email Id will not be published!