Jairam Ramesh : పార్టీకి గెహ్లాట్ ముఖ్యం..పైల‌ట్ అవ‌స‌రం

స్ప‌ష్టం చేసిన పార్టీ అగ్ర నేత జైరాం ర‌మేష్

Jairam Ramesh : రాజ‌స్థాన్ లో రాజ‌కీయం మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. గ‌త కొంత కాలం నుంచి సీఎం అశోక్ గెహ్లాట్ , యువ నాయ‌కుడు స‌చిన్ పైల‌ట్ మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. ఈ త‌రుణంలో అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొన‌సాగుతోంది.

ఇదిలా ఉండ‌గానే సీఎం అశోక్ గెహ్లాట్ పార్టీని కాద‌ని స‌చిన్ పైల‌ట్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తాను కంఠంలో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు స‌చిన్ పైల‌ట్ సీఎం కాలేడ‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ద్రోహం త‌ల‌పెట్టిన చ‌రిత్ర పైల‌ట్ ది అని ఆరోపించాడు.

ఆపై రూ. 10 కోట్లు ఇచ్చి ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టాల‌ని చూశాడ‌ని, వెనుక నుండి పావులు క‌దిపాడని మండిప‌డ్డారు. ఇరువురు నాయ‌కుల మ‌ధ్య చోటు చేసుకున్న దూరాన్ని త‌గ్గించే ప‌నిలో కాంగ్రెస్ పార్టీ హై క‌మాండ్ ఫోక‌స్ పెట్టింది.

ఈ సంద‌ర్భంగా ఆదివారం ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మీడియా ఇన్ ఛార్జ్ జైరాం ర‌మేష్(Jairam Ramesh) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ పార్టీలో కొట్లాట‌లు, దూష‌ణ‌లు, ఆరోప‌ణ‌లు స‌హ‌జ‌మేన‌ని పేర్కొన్నారు. అయితే సీఎం అశోక్ గెహ్లాట్ , స‌చిన్ పైల‌ట్ ఇద్ద‌రూ త‌మ‌కు ముఖ్య‌మేన‌ని స్ప‌ష్టం చేశారు.

సీఎం అత్యంత ముఖ్య‌మైన వ్య‌క్తి అని, ఇదే స‌మ‌యంలో స‌చిన్ పైల‌ట్ అత్యంత అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే వారిద్ద‌రూ మ‌ళ్లీ ఒక్క‌టి అవుతార‌ని , ప‌వ‌ర్ పాలిటిక్స్ లో కొంద‌రు కావాల‌ని పార్టీని ఇబ్బందుల‌కు గురి చేయాల‌ని బీజేపీ ఆడుతున్న నాట‌క‌మ‌ని జైరాం ర‌మేష్ ఆరోపించారు.

Also Read : జీ20 అధ్య‌క్ష ప‌ద‌వి భార‌త్ కు ద‌క్కిన గౌర‌వం

Leave A Reply

Your Email Id will not be published!