Nazam Sethi : ప్ర‌భుత్వ నిర్ణ‌యం మీదే భారం

పీసీబీ చైర్మ‌న్ న‌జాం సేథీ

Nazam Sethi : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మ‌న్ న‌జామ్ సేథీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 2023 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్తాన్ జ‌ట్టు పాల్గొంటుందా లేదా అన్న‌ది త‌మ చేతుల్లో లేద‌ని అన్నారు. న‌జామ్ సేథీ(Nazam Sethi) మీడియాతో మాట్లాడారు. భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న వివాదాల నేప‌థ్యంలో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. ఈ త‌రుణంలో ఆడాలా వ‌ద్దా అన్న మీమాంస‌లో ఉన్నారు పీసీబీ చైర్మ‌న్.

దీనిపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. మ‌రో వైపు హైబ్రిడ్ మాడ‌ల్ ను అమ‌లు చేయాల‌ని ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్ణ‌యించింది. కొన్ని మ్యాచ్ లు శ్రీ‌లంక‌లో, మ‌రికొన్ని మ్యాచ్ లు పాకిస్తాన్ లో , ఇంకొన్ని మ్యాచ్ లు త‌ట‌స్థ వేదిక‌ల‌లో నిర్వ‌హించేందుకు ఓకే చెప్పింది.

ఇదిలా ఉండ‌గా ఇండియాకు వెళ్లాలా వ‌ద్దా అన్న‌ది తమ చేతుల్లో లేద‌న్నారు. కేవ‌లం ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యంపై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంపై ఇప్ప‌ట్లో ఏమీ చెప్ప‌లేమ‌న్నారు. ఉత్త‌ర భార‌త న‌గ‌రంలో ఆడేందుకు తాము సుముఖంగా లేమ‌ని పాకిస్తాన్ బోర్డు చైర్మ‌న్ స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే చోటు చేసుకున్న ప‌రిస్థితుల దృష్ట్యా ఐసీసీకి లేఖ రాశామ‌ని చెప్పారు నిజామ్ సేథీ. అహ్మ‌దాబాద్ లో ఆడాలా వ‌ద్దా అనేది ఇప్పుడే చెప్ప‌లేమ‌న్నారు పీసీబీ చైర్మ‌న్.

Also Read : BJP SG Surya : బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సూర్య అరెస్ట్

 

Leave A Reply

Your Email Id will not be published!