Gudivada Amarnath : వెబ్ సీరీస్ లా ప‌వ‌న్ వారాహి యాత్ర

మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ కామెంట్స్

Gudivada Amarnath : ఏపీ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై , టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ చేపట్టిన వారాహి యాత్ర ఓటీటీలో ప్ర‌సార‌మ‌య్యే వెబ్ సీరీస్ లాగా ఉంద‌ని సెటైర్ వేశారు. ప‌వ‌న్ సినిమాల్లో హీరో అయినా రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు విల‌న్ అంటూ ఎద్దేవా చేశారు. బాబును న‌మ్ముకుంటే కుక్క తోక ప‌ట్టుకుని గోదావ‌రిని ఈదిన‌ట్టేన‌ని అన్నారు గుడివాడ అమ‌ర్నాథ్.

2024లో జ‌రిగే ఎన్నిక‌ల్లో ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి కొట్టే దెబ్బ‌కు ప్ర‌తిప‌క్షాలకు షాక్ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు మంత్రి. 2019 ఎన్నిక‌ల ఫ‌లితాలే రిపీట్ అవుతాయ‌ని చెప్పారు. తెలుగుదేశం , జ‌న సేన పార్టీ, బీజేపీ పార్టీల‌న్నీ ఏక‌మై వ‌చ్చినా త‌మ‌ను త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌న్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న 175 అసెంబ్లీ స్థానాల‌కు అన్నీ గెలిచేందుకు తాము ప్లాన్ చేస్తున్నామ‌ని, గెల‌వ‌డం మాత్రం ప‌క్కా అని పేర్కొన్నారు గుడివాడ అమ‌ర్నాథ్(Gudivada Amarnath).

ఇవాళ గండికోట‌లో ఓబెరాయ్ గ్రూప్ రిస్టార్ట్స్ కు సీఎం శంకుస్థాప‌న చేశార‌ని, త్వ‌ర‌లో తిరుప‌తి , అన్న‌వ‌రాల్లో కూడా హోట‌ల్స్ వ‌స్తాయ‌ని పేర్కొన్నారు. ఎన్నిక‌లు కాక ముందే ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిచ్చి ప‌ట్టిన‌ట్లు విజ‌య యాత్ర‌లు చేప‌ట్ట‌డం దారుణ‌మ‌న్నారు.

Also Read : RK Roja : చంద్ర‌బాబు విజ‌న్ బ‌క్వాస్ – ఆర్కే రోజా

Leave A Reply

Your Email Id will not be published!