PBKS vs GT IPL 2022 : చెల‌రేగిన లివింగ్ స్టోన్ ధావ‌న్ ధనాధ‌న్

గుజ‌రాత్ టైటాన్స్ టార్గెట్ 190 ప‌రుగులు

PBKS vs GT  : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా ముంబై వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ గుజ‌రాత్ టైటాన్స్ (PBKS vs GT )ముందు 190 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 189 ప‌రుగులు చేసింది.

లివింగ్ స్టోన్ అద్భుత‌మైన బ్యాటింగ్ తో దుమ్ము రేపాడు. కేవ‌లం 27 బంతులు ఎదుర్కొని 64 ప‌రుగులు చేశాడు. ఇక శిఖ‌ర్ ధావ‌న్ 35 ప‌రుగులు చేసి స‌త్తా చాటాడు. ఇక ఆఖ‌రులో వ‌చ్చిన రాహుల్ చ‌హ‌ర్ 14 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు ఓ సిక్స‌ర్ తో 22 ర‌న్స్ చేశాడు.

దీంతో పంజాబ్ కింగ్స్ భారీ టార్గెట్ ముందుంచింది. ఇక గుజ‌రాత్ టైటాన్స్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ 3 వికెట్లు తీస్తే న‌ల్కండే 2 , పాండ్యా , ఫెర్గూస‌న్ , ష‌మీ చెరో వికెట్ తీశారు. అంత‌కు ముందు గుజ‌రాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు గుజ‌రాత్ టైటాన్స్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో గెలుపొంది జోరు మీదుంది. మ‌రో వైపు మ‌యాంక్ అగ‌ర్వాల్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్(PBKS vs GT )మూడు మ్యాచ్ లు ఆడి రెండు గెలిచింది. ఒక‌టి ఓడి పోయింది.

సేమ్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జట్టు సైతం ఇదే సీన్. ఇక ఈసారి ఐపీఎల్ 2022లో టైటిల్ ఫెవ‌రేట్ లుగా ఉన్న చెన్నై సూప‌ర్ కింగ్స్ , ముంబై ఇండియ‌న్స్ జ‌ట్లు ఇంకా ఖాతా తెర‌వ‌క పోవ‌డం విశేషం. ఇక ఇవాళ మ్యాచ్ లో ఎవ‌రు గెలుస్తార‌నేది ఉత్కంఠ నెల‌కొంది.

Also Read : తెగిస్తేనే నిలుస్తాం విజ‌యం సాధిస్తాం

Leave A Reply

Your Email Id will not be published!