Harish Rao : క‌మ‌లం..హ‌స్తంకు డిపాజిట్లు రావు

ఆర్థిక మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు

Harish Rao : సిద్దిపేట – రాష్ట్ర ఆర్థిక‌, ఆరోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు అంత సీన్ లేద‌న్నారు. వాళ్లు అధికారంలోకి వ‌స్తామ‌ని క‌ల‌లు కంటున్నార‌ని పేర్కొన్నారు. మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు . తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ సిద్దిపేట లో జ‌రిగిన ఎన్నిక‌ల ప్రచారంలో ప్ర‌సంగించారు.

Harish Rao Shocking Comments

బీజేపీ గెల‌వ‌ద‌ని తెలిసి రోజుకో నాయ‌కుడు పార్టీ వీడుతున్నార‌ని ఇక పార్టీ ఎలా గెలుస్తుంద‌ని ప్ర‌శ్నించారు. ఆ పార్టీలో స్వేచ్ఛ లేద‌ని విజ‌య శాంతి, వివేక్ ,, చంద్ర‌శేఖ‌ర్ లాంటి నాయ‌కులు గుడ్ బై చెప్పార‌ని ఇక‌నైనా త‌మ‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

బీజేపీ చెప్పే మాట‌ల‌న్నీ నీటి మూద రాత‌ల‌ని పేర్కొన్నారు త‌న్నీరు హ‌రీశ్ రావు(Harish Rao). ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డంలో ఫెయిల్ అయ్యింద‌న్నారు. గ్యారెంటీల పేరుతో క‌న్న‌డ నాట ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన ఆ పార్టీ ఏ ఒక్క దానిని అమ‌లు చేసిన పాపాన పోలేద‌న్నారు.

అక్క‌డ 5 గ్యారెంటీలు ఇచ్చార‌ని ఇదే బాప‌తు హామీలు తెలంగాణ‌లో వ‌ర్క‌వుట్ కాద‌న్నారు హ‌రీశ్ రావు. రాష్ట్రంలో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో మ‌రోసారి బీఆర్ఎస్ గెలవ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. ముచ్చ‌ట‌గా మూడోసారి సీఎం కుర్చీపై కేసీఆర్ కొలువు తీరడం ఖాయ‌మ‌న్నారు హ‌రీశ్ రావు.

Also Read : AP CM YS Jagan : అగ్ని ప్ర‌మాదం విచార‌ణ‌కు ఆదేశం

Leave A Reply

Your Email Id will not be published!