Heavy Rains AP : వ‌ర్ష బీభ‌త్సం రైతులు ఆగ‌మాగం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అంతా అస్త‌వ్య‌స్తం

Heavy Rains AP : అమ‌రావ‌తి – బంగాళా ఖాతంలో ఏర్ప‌డిన అల్ప పీడ‌నం వాయుగుండంగా మారింది. దీంతో మిచౌంగ్ తుపాను కార‌ణంగా భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల ధాటికి పంట‌లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల‌కొరిగాయి. చాలా చోట్ల విద్యుత్ స‌ర‌ఫరా స్తంభించి పోయింది. ఎక్క‌డ చూసినా చేతికి వ‌చ్చిన పంట‌ల‌న్నీ ధ్వంసం అయ్యాయి. ఆరుగాలం క‌ష్ట‌ప‌డి పండించే పంట‌ల‌న్నీ నీళ్ల పాలు కావ‌డంతో కంట త‌డి పెడుతున్నారు రైత‌న్న‌లు.

Heavy Rains AP Farmers Suffering

రాష్ట్రంలోని 8 జిల్లాలను వ‌ర్షాలు ముంచెత్తాయి. దీంతో జ‌న జీవ‌నం స్తంభించి పోయింది. ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ర‌హ‌దారులు జ‌ల‌మ‌యం అయ్యాయి. వాహ‌నాల రాక పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. ఇక వాహ‌న‌దారులు, సామాన్య ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ల‌క్ష‌ల ఎక‌రాల్లో వరి పంటకు న‌ష్టం వాటిల్లింది. తుపాను తీవ్ర‌త‌ను గ‌మ‌నించిన రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అప్ర‌మ‌త్త‌మైంది. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(CM Jagan Mohan Reddy) ఎప్ప‌టిక‌ప్పుడు ఆరా తీస్తున్నారు. ఏ ఒక్క‌రికీ ఇబ్బంది క‌ల‌గ‌కుండా స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు ఉన్న‌తాధికారుల‌ను.

Also Read : CM Revanth Reddy : ఖ‌ర్గేతో రేవంత్ రెడ్డి భేటీ

Leave A Reply

Your Email Id will not be published!