HYD Gang Rape : బాలిక‌ గ్యాంగ్ రేప్ కేసు పీఎస్ వ‌ద్ద ఉద్రిక్త‌త

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం

HYD Gang Rape : హైద‌రాబాద్ లో బాలిక సామూహిక రేప్ న‌కు గురైన ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది. ఈ బ‌ల‌త్కారానికి పాల్ప‌డిన వారు పేరొందిన ఫ్యామిలీస్ కు చెందిన వార‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆరోపిస్తోంది.

విచిత్రం ఏమిటంటే ఈ సామాహిక అత్యాచారానికి పాల్ప‌డిన నిందితులంతా 11, 12వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థులు కావ‌డం విశేషం. ఈ స్టూడెంట్స్ రాజ‌కీయంగా ప్ర‌భావిత‌మైన కుటుంబాల‌కు చెందిన వార‌ని పోలీసులు వెల్ల‌డించారు.

గ్యాంగ్ రేప్ శ‌నివారం సాయంత్రం హైద‌రాబాద్(HYD Gang Rape) మెర్సిడెస్ కారులో 17 ఏళ్ల బాలిక‌పై పాఠ‌శాల విద్యార్థుల బృందం సామూహిక రేప్ న‌కు గురైంది.

విష‌యం తెలిసిన న‌గ‌ర భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన కార్య‌క‌ర్త‌లు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేష‌న్ ఎదుట ఆందోళ‌న‌కు దిగారు. దీంతో స్టేష‌న్ వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది.

ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రినీ అరెస్ట్ చేయ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ బృందంలో ఓ ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కాగా అత‌ను ముందే వెళ్లి పోయి ఉండ‌వ‌చ్చ‌ని పోలీసులు చెబుతున్నారు.

సామూహిక అత్యాచారం అనంత‌రం ఆ అబ్బాయిలు బాలిక‌ను ప‌బ్ లో ప‌డేసి వెళ్లి పోయారు. ఆమె త‌న తండ్రిని పిక‌ప్ చేయ‌మ‌ని కోరింది. ఆమె మెడ‌పై గాయాలు కూడా ఉన్నాయి.

తండ్రికి త‌న‌పై కొంత మంది అబ్బాయిలు దాడి చేశార‌ని తెలిపింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేర‌కు పోలీసులు ప్రాథ‌మికంగా కేసు న‌మోదు చేశారు. దాన్ని రేప్(HYD Gang Rape) కేసుగా మార్చారు. మొత్తంగా ఈ వ్య‌వ‌హారం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది.

Also Read : నా తెలంగాణ కోటి ర‌త‌ణాల వీణ

Leave A Reply

Your Email Id will not be published!