Shashi Tharoor : నేనేమీ ‘కిండర్ గార్డెన్’ లో లేను – శశి థరూర్
ఎవరితో పేచీ లేదు పార్టీతోనే ప్రయాణిస్తున్నా
Shashi Tharoor : తాను ఏమిటో తన పరిమితులు ఏమిటో తనకు బాగా తెలుసన్నారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్. తాను పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నట్లు కొందరు భావిస్తుండడం తనను విస్తు పోయేలా చేసిందన్నారు ఎంపీ.
ఆదివారం కొచ్చిలో జాతీయ మీడియాతో మాట్లాడారు శశి థరూర్(Shashi Tharoor). తాను ఏమీ చిన్న పిల్లాడిని కాదని తాను ఏమీ కిండర్ గార్డెన్ లో ప్రస్తుతం చదువు కోవడం లేదని స్పష్టం చేశారు. తనకు ఎవరితో పేచీ లేదని పేర్కొన్నారు.
కొందరు కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, అది వారి వ్యక్తిగతమని అన్నారు. తాను లైఫ్ ను ఎంజాయ్ చేస్తానని..చిల్లర, పనికిరాని విషయాలపై ఫోకస్ పెట్టనని కుండ బద్దలు కొట్టారు శశి థరూర్. తాను మొదటి నుంచీ పార్టీలో ప్రశ్నిస్తూనే ఉన్నానని అదే పార్టీకి బలమని అన్నారు. తాను రచయితగా స్వేచ్ఛను కోరుకుంటానని ఆ తర్వాతే ఎంపీనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో రాబోయే 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ సీఎం అభ్యర్థిగా తనను తాను ప్రొజెక్టు చేసుకుంటున్నట్లు పార్టీకి చెందిన కొందరు భ్రమ పడుతున్నారని ఎద్దేవా చేశారు. దానికి తాను ఏమీ చేయలేనని అన్నారు.
తనకు ఏ పదవిపై ఆసక్తి లేదన్నారు. ప్రజలతో కలిసి ఉండేందుకు తాను ఎక్కువగా ఇష్ట పడతానని చెప్పారు శశి థరూర్. తాను పార్టీలో ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడలేదని, ఆదేశాలకు విరుద్దంగా ప్రవర్తించ లేదని స్పష్టం చేశారు శశి థరూర్(Shashi Tharoor).
Also Read : దీదీకి దమ్ముంటే పౌరసత్వ చట్టాన్ని ఆపాలి