Anil Kumar Yadav : జగన్ కు తప్ప ఎవరికీ తలవంచను
అనిల్ కుమార్ యాదవ్
Anil Kumar Yadav : మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ తలవంచనని ఒక్క సీఎం జగన్ కు తప్ప . 2024లో జరగ బోయే శాసనసభ ఎన్నికల్లో తనకు సీటు రాదంటూ జరుగుతున్న ప్రచారంపై మండి పడ్డారు. కొందరు పనిగట్టుకుని ఆనందం పొందుతున్నారని ఫైర్ అయ్యారు.
తాను బతికినా లేక చచ్చినా సింహం లాగానే బతుకుతానని అన్నారు. ఆరు నూరైనా తాను పోటీ చేయడం ఖాయమని అన్నారు.మరోసారి పోటీ చేస్తా..విజయం సాధిస్తానని అన్నారు. సీఎం జగన్ ఆశయాల సాధన కోసం తాను పని చేశానని అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav) చెప్పారు. తాను గెలిచాక మీరంతా విస్తు పోవడం ఖాయం అన్నారు. తాను ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖాయమన్నారు. తాను ఎక్కడికీ వెళ్ళనని చెప్పారు.
బతికినంత కాలం సింహం లాగానే బతుకుతానని, అలాగే చని పోతానని అన్నారు అనిల్ . తాను తప్పు చేయనని , తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారికి ఇదే తన వార్నింగ్ అని స్పష్టం చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. తనపై కావాలని కొందరు ఆరోపణలు చేయడం పై మండిపడ్డారు. తానేమిటో తన పవర్ ఏమిటో సీఎంకు బాగా తెలుసు అన్నారు.
ఆరు నూరైనా సరే తాను విజయం సాధించడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి. జనం కోసం తాను ఎంతో కష్టపడి పని చేశానని , ప్రజల కోసం వారి అభ్యున్నతి కోసం కృషి చేశానని అన్నారు.
Also Read : యువ గళం కానుందా ప్రభంజనం