MLC Kavitha : సుఖేశ్ ఎవ‌రో తెలియ‌దు – క‌విత

అన్నీ అబ‌ద్దాలు ఫేక్ ప్ర‌చారాలు

MLC Kavitha : త‌న‌పై లేనిపోని ప్ర‌చారాలు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత(MLC Kavitha). గురువారం ఆమె కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. తెలంగాణ బిడ్డ‌లు త‌ల వంచ‌ర‌ని స్ప‌ష్టం చేశారు. అస‌త్యాలు ప‌దే ప‌దే ప్ర‌చారం చేసినంత మాత్రాన నిజాలై పోవ‌ని పేర్కొన్నారు క‌విత‌.

సుఖేశ్ చంద్ర‌శేఖ‌ర్ ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని, ఆయ‌న‌తో ప‌రిచ‌యం ఎలా ఉంటుంద‌ని ప్ర‌శ్నించారు. ఎవ‌రో ఎన్నో ర‌కాలుగా బ‌ద్నాం చేయాల‌ని చూస్తుంటార‌ని అంత మాత్రాన ప‌దే ప‌దే ఛాన‌ళ్లు, ప‌త్రిక‌లు ప్ర‌సారం చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు. ముందు వాస్త‌వాలు ఏమిటో తెలుసు కోవాల‌ని ఏదో సెన్సేష‌న్ కోసం ఇలా చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు.

ప్ర‌తి ఒక్క‌రికీ కుటుంబం అనేది ఉంటుంద‌ని , ఇప్ప‌టికే ఏమీ లేద‌ని తేలి పోయింద‌న్నారు. కేంద్రం కావాల‌ని త‌న తండ్రిని టార్గెట్ చేసింద‌ని అందులో భాగంగానే త‌న‌ను ఇరికించే ప్ర‌య‌త్నం చేస్తోందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. నిజాలు త్వ‌ర‌లోనే తెలుస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌(MLC Kavitha).

రాజ‌కీయంగా ఎదుర్కోవ‌డం చేత కాక బ‌ల‌మైన బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టేందుకు మీడియా సంస్థ‌ల‌ను, సోష‌ల్ , డిజిట‌ల్ మీడియాల‌ను వాడుకుంటున్నాయ‌ని ఆరోపించారు. చివ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు ఎవ‌రు ఏమిటో తెలుస్తుంద‌న్నారు.

Also Read : కేసీఆర్ ద‌మ్మున్న లీడ‌ర్ – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!