IND vs ENG T20 World Cup : భార‌త్ ఇంగ్లండ్ బిగ్ ఫైట్

ఉత్కంఠ రేపిన సెమీస్ పోరు

IND vs ENG T20 World Cup : ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ -2022 ఆఖ‌రి అంకానికి చేరింది. కేవ‌లం ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది. న్యూజిలాండ్ పై పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసి ఫైన‌ల్ కు చేరింది.

ద‌క్షిణాఫ్రికాపై నెద‌ర్లాండ్స్ సంచ‌ల‌న గెలుపు సాధించ‌డంతో ర‌న్ రేట్ కార‌ణంగా పాకిస్తాన్ అనుకోని రీతిలో సెమీస్ కు చేరింది. ఇదే క్ర‌మంలో పాకిస్తాన్ జ‌ట్టు హెడ్ కోచ్ మాథ్యూ హేడ‌న్ టి20 క‌ప్ వ‌ర‌ల్డ్ క‌ప్ త‌మ‌దేన‌ని హెచ్చ‌రించాడు.

ఈ త‌రుణంలో చిర‌కాల ప్ర‌త్య‌ర్థులైన భార‌త్, పాకిస్తాన్ జ‌ట్లు ఫైన‌ల్ కు చేరుకుంటాయ‌ని మాజీ క్రికెట‌ర్లు జోష్యం చెబుతున్నారు. మెగా టోర్నీలో భాగంగా రెండో సెమీ ఫైన‌ల్ మ్యాచ్ న‌వంబ‌ర్ 10 గురువారం జ‌ర‌గ‌నుంది. ఇందులో భాగంగా ఇవాళ భార‌త జ‌ట్టు ఇంగ్లండ్ జ‌ట్టుతో పోటీ ప‌డ‌నుంది.

ప్ర‌స్తుతం ఇంగ్లండ్ అత్యంత బ‌లంగా ఉంది. మ‌రో వైపు టీమిండియా సూప‌ర్ ఫామ్ లో కొన‌సాగుతోంది. విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాద‌వ్ , రోహిత్ , కేఎల్ రాహుల్ , హార్దిక్ పాండ్యా గ‌నుక స‌త్తా చాటితే ఇంగ్లండ్(IND vs ENG T20 World Cup) త‌ట్టుకోవ‌డం క‌ష్టం.

బ‌ట్ల‌ర్, స్టోక్ ప్ర‌మాద‌క‌ర‌మైన ఆట‌గాళ్లు. ఇటీవ‌ల గాయప‌డి తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు రోహిత్ శ‌ర్మ‌. ఆదిల్ ర‌షీద్ , సామ్ క‌ర‌న్ రాణిస్తే భార‌త్ కు క‌ష్టం.

ఇదిలా ఉండ‌గా రిష‌బ్ పంత్ , దినేశ్ కార్తీక్ ఇద్ద‌రిలో ఎవ‌రు ఉంటార‌నేది ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు భార‌త జ‌ట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్. అక్ష‌ర్ ప‌టేల్ కు బ‌దులు యుజ్వేంద్ర చాహ‌ల్ ను తీసుకునే ఛాన్స్ ఉంది.

Also Read : టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కు పాకిస్తాన్

Leave A Reply

Your Email Id will not be published!