IND vs IRE 2nd T20 : దంచి కొట్టిన హుడా రెచ్చి పోయిన శాంస‌న్

ఐర్లాండ్ తో భార‌త్ ప‌రుగుల వ‌ర‌ద

IND vs IRE 2nd T20 : ఐర్లాండ్ లోని డ‌బ్లిన్ లో జ‌రుగుతున్న టీ20 రెండో మ్యాచ్ లో భార‌త జ‌ట్టు(IND vs IRE 2nd T20) భారీ స్కోర్ చేసింది. టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భార‌త జ‌ట్టు మేనేజ్ మెంట్ చేసిన ప్ర‌యోగం ఫ‌లించింది.

మొద‌టి టి20 మ్యాచ్ కు దూరంగా ఉన్న స్టార్ హిట్ట‌ర్ సంజూ శాంస‌న్ ఈ మ్యాచ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక దీపక్ హుడా రెచ్చి పోయాడు. వ‌చ్చీ రావ‌డంతోనే ఐర్లాండ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.

ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్ నిరాశ ప‌రిచినా ఆ త‌ర్వాత దీప‌క్ హుడా, సంజూ శాంస‌న్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి ఆడారు. తొలి టి20 మ్యాచ్ లో స‌త్తా చాటిన దీప‌క్ రెండో మ్యాచ్ లో సైతం అదే రీతిన రెచ్చి పోయాడు.

ఏకంగా 57 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న హుడా సెంచ‌రీ చేశాడు. ఇందులో 9 ఫోర్లు 6 సిక్స‌ర్లు ఉన్నాయి. 104 ప‌రుగులు చేసి చుక్క‌లు చూపించాడు. ఇక ఓపెన‌ర్ గా బ‌రిలోకి దిగిన సంజూ శాంస‌న్ తానేమీ త‌క్కువ కాద‌న్న‌ట్టు స‌త్తా చాటాడు.

42 బంతులు ఎదుర్కొన్న శాంస‌న్ 77 ప‌రుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు 4 సిక్స‌ర్లు ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా హుడాకు త‌న కెరీర్ లో టి20 ఫార్మాట్ లో ఇదే తొలి సెంచ‌రీ కావ‌డం విశేషం.

ఇక భార‌త క్రికెట్ లో టి20 త‌ర‌పున సెంచ‌రీ చేసిన నాలుగో క్రికెట‌ర్ గా చ‌రిత్ర సృష్టించాడు. ఇక భార‌త జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 227 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.

Also Read : ఆట‌కు వీడ్కోలు చెప్పిన స్టార్ క్రికెట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!