INDIA Stand : ‘ఇండియా’ గ‌రం మోదీపై ఆగ్రహం

నిప్పులు చెరిగిన విప‌క్షాలు

INDIA Stand : విప‌క్షాల కూట‌మి ఇండియా నిప్పులు చెరిగింది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ బాధ్య‌తా రాహిత్యాన్ని ప్ర‌శ్నించింది. మ‌ణిపూర్ లో చోటు చేసుకున్న హింస‌కు ఆయ‌నే బాధ్యుడంటూ ఆరోపించింది. పార్ల‌మెంట్ సాక్షిగా నిల‌దీసింది. ఆపై ఆందోళ‌న చేప‌ట్టింది. ఓ వైపు మ‌ణిపూర్ కాలి పోతుంటే చోద్యం చూస్తూ ఊరుకుంటారా అంటూ ప్ర‌శ్నించింది.

INDIA Stand Comment

గ‌త మే 3 నుంచి మ‌ణిపూర్ లో వేలాది మంది నిరాశ్ర‌యుల‌య్యారు. 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం శిబిరాల‌లో త‌ల‌దాచు కున్నార‌ని ఏఐసీసీ చీఫ్ ఖ‌ర్గే(Mallikarjun Kharge) ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎందుక‌ని కేంద్రం స్పందించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

దీనికి న‌రేంద్ర మోదీ బేష‌ర‌తుగా స‌మాధానం చెప్పి తీరాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు ఏఐసీసీ చీఫ్‌. విప‌క్షాల కూట‌మి ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టింది. తాము అడిగిన ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు చెప్పే స్థితిలో ప్ర‌స్తుతం కేంద్ర స‌ర్కార్ లేద‌న్నారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే.

ఒక బాధ్య‌త క‌లిగిన ప్ర‌ధాన మంత్రి క‌ష్ట కాలంలో ఇలాగేనా వ్య‌వ‌హ‌రించేది అంటూ ప్ర‌శ్నించారు. మ‌ణిపూర్ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని, దేశ ప్ర‌జ‌ల‌కు జ‌వాబు చెప్పాల్సింది మీరేనంటూ మోదీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు ఏఐసీసీ చీఫ్‌.

Also Read : Yogi Adityanath : సీఎం యోగినా మ‌జాకా

Leave A Reply

Your Email Id will not be published!