Punjab PCC Chief : జైన్..సిసోడియాలు భ‌గ‌త్ సింగ్ కాలేరు

కేజ్రీవాల్ పై పంజాబ్ కాంగ్రెస్ చీఫ్

Punjab PCC Chief :  దేశం కోసం ఉరి కొయ్య‌ల‌ను ముద్దాడిన వాడు స‌ర్దార్ ష‌హీద్ భ‌గ‌త్ సింగ్. దోపిడీ, అక్ర‌మాల‌కు పాల్ప‌డుతూ కేసులతో స‌త‌మ‌తం అవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ , డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాలు ఎన్న‌టికీ భ‌గ‌త్ సింగ్ కాలేర‌ని నిప్పులు చెరిగారు పంజాబ్ పీసీసీ చీఫ్ అమ‌రీంద‌ర్ సింగ్ రాజా వారింగ్(Punjab PCC Chief) .

సోయి ఉండే మాట్లాడుతున్నావా కేజ్రీవాల్ అంటూ నిప్పులు చెరిగారు. సోమవారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏం సాధించార‌ని, దేశం కోసం ఏమైనా చేశారా ఎందుక‌ని వాళ్ల‌ను భ‌గ‌త్ సింగ్ తో పోల్చాల్సి వ‌చ్చిందంటూ ప్ర‌శ్నించారు. ఇలాంటి చౌక‌బారు , నీతి మాలిన రాజ‌కీయాల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని కోరారు.

భ‌గ‌త్ సింగ్ స్పూర్తిని తీసుకుని కోట్లాది మంది ప్ర‌జ‌లు కొలుస్తున్నార‌ని ఆయ‌న‌కు సిసోడియాకు, జైన్ కు పోలిక ఏంటి అని నిప్పులు చెరిగారు పంజాబ్ పీసీసీ చీఫ్‌. సామాన్యుల పార్టీ అని చెప్పుకునే ఆప్ ఇవాళ అవీనీతి, అక్ర‌మాల‌కు కేరాఫ్ గా మారింద‌ని ఆరోపించారు. ఇక నుంచి స్వాతంత్ర స‌మ‌ర‌యోధుల‌తో ఎవ‌రినీ పోల్చ‌కండి అని సూచించారు కేజ్రీవాల్ కు.

వీలైతే భ‌గ‌త్ సింగ్ ధైర్యాన్ని, స్పూర్తిని కొనియాడ‌డంలో త‌ప్పు లేదు. కానీ భ‌గ‌త్ సింగ్ తో ఎవ‌రూ స‌రితూగే నాయ‌కుడు ఈ దేశంలో ప్ర‌పంచంలో ఎక్క‌డా పుట్ట లేద‌న్నారు అమ‌రీంద‌ర్ సింగ్ రాజా వారింగ్.

ఇక నుంచి ఎక్క‌డైనా ఎవ‌రైనా ఆప్ నాయ‌కులు భ‌గ‌త్ సింగ్ ను పోలిస్తే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు పీసీసీ చీఫ్‌.

 

Leave A Reply

Your Email Id will not be published!