NTR Kalyan Ram : క‌ళ్యాణ్ రామ్..జూనియ‌ర్ ఎన్టీఆర్ ప‌రామ‌ర్శ‌

తార‌క‌ర‌త్న‌కు పూర్తి స్థాయిలో చికిత్స

NTR Kalyan Ram : నారా లోకేష్ చేప‌ట్టిన యువ గ‌ళం పాద‌యాత్ర‌లో పాల్గొన్న న‌టుడు నంద‌మూరి తార‌క‌ర‌త్న ఉన్న‌ట్టుండి ప‌డి పోయాడు. ఆయ‌న‌కు గుండె నొప్పి రావ‌డంతో కుప్పంలో చేర్పించారు.

అక్క‌డి నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగ‌ళూరుకు త‌ర‌లించారు. నారాయ‌ణ హృదయాల‌య ఆస్ప‌త్రిలో ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్నారు. తార‌క‌ర‌త్న ప‌క్క‌నే ఉన్నారు న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌.

ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యానికి స‌హ‌క‌రిస్తున్నార‌ని, త్వ‌ర‌లోనే కోలుకుంటున్నార‌ని, నా బిడ్డ‌కు ఏమీ కాద‌న్నారు. తార‌క‌ర‌త్న ఆస్ప‌త్రిలో చేరార‌ని తెలుసుకున్న న‌టులు క‌ళ్యాణ్ రామ్ , జూనియ‌ర్ ఎన్టీఆర్(NTR Kalyan Ram) ఆదివారం ప్ర‌త్యేక విమానంలో బెంగ‌ళూరుకు చేరుకున్నారు. వారికి సాద‌ర స్వాగ‌తం ప‌లికారు కర్ణాట‌క రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి .

అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చూడాల్సిందిగా సీఎం బొమ్మై ఆదేశించారు. ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని తెలిపారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా నారాయ‌ణ హృద‌యాల‌య ఆస్ప‌త్రికి చేరుకున్నారు న‌టులు క‌ళ్యాణ్ రామ్ , జూనియ‌ర్ ఎన్టీఆర్. అక్క‌డే ఉన్న త‌మ బాబాయి నంద‌మూరి బాల‌కృష్ణ‌తో మాట్లాడారు.

అనంతరం ఐసీయూలో ఉన్న తార‌కర‌త్న‌ను చూశారు. ఇదిలా ఉండ‌గా ఆస్ప‌త్రి వ‌ద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మ‌రో వైపు ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు, ఎన్టీఆర్ ఫ్యామిలీతో ద‌గ్గ‌రి అనుబంధం క‌లిగిన పునీత్ రాజ్ కుమార్ సోద‌రుడు పునీత్ శివ‌రాజ్ కుమార్ ఆస్ప‌త్రికి వ‌చ్చారు. బాల‌కృష్ణ‌తో భేటీ అయ్యారు.

ఇదిలా ఉండ‌గా తార‌క‌ర‌త్న‌కు ఏమీ కాద‌ని, త‌న బిడ్డ ఎప్ప‌టి లాగే బ‌తికి బ‌య‌ట‌కు వ‌స్తాడ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు నంద‌మూరి బాల‌కృష్ణ‌.

Also Read : తార‌క‌ర‌త్న ఆరోగ్యంపై బాల‌య్య క్లారిటీ

Leave A Reply

Your Email Id will not be published!