JC Madhu Swamy : కర్ణాటక మంత్రి ఆడియో లీక్ కలకలం
ప్రభుత్వం పేరుకే ఉంది మేనేజ్ చేస్తున్నాం
JC Madhu Swamy : కర్ణాటకలో సీఎంగా బస్వరాజ్ బొమ్మై కొలువు తీరిన నాటి నుంచి ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటూనే ఉంది. ఆయనకు సౌమ్యుడిగా పేరొంది.
కానీ రాష్ట్రంలో తరుచూ వివాదాలు, మత కలహాలు జరగడం ఒకింత ఇబ్బందికి గురి చేస్తోంది సీఎంను. తాజాగా తన కేబినెట్ కు చెందిన మంత్రి ఆడియో లీక్ కావడం ఇప్పుడు పెద్ద తలనొప్పిని తెచ్చి పెట్టింది బొమ్మైకి.
ఇప్పటికే కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తోలు బొమ్మ ప్రభుత్వం అంటూ సంచలన కామెంట్స్ చేశారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అన్నది ఉందా అని ఆయన ప్రశ్నించారు.
దీనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక తాజా విషయానికి వస్తే తాము ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నాం. కానీ దానిని అమలు మాత్రం చేయడం లేదంటూ కర్ణాటక న్యాయ శాఖ మంత్రి జేసీ మధుస్వామి(JC Madhu Swamy) మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మరో వైపు శివ మొగ్గలో హిందూ, ముస్లిం వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. తాము తల్చుకుంటే ముస్లింలు ఇక్కడ ఉండలేరంటూ సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప.
ఇది ఇలా కొనసాగుతుండగానే సీఎం బొమ్మైకి మంత్రి చేసిన ఆడియో రూపంలో కలకలం రేగడం ఇబ్బందిగా మారింది. ఈ కామెంట్స్ ప్రామాణికమైనవని, అయితే సందర్భానుసారం తీసుకోలేదని ధ్రువీకరించడం విశేం.
ఆడియో మరింత చర్చకు దారి తీయడంతో సదరు కామెంట్స్ చేసిన మంత్రి వివరణ ఇచ్చు కోవాల్సి వచ్చింది. అంతా బాగుంది. సర్కార్ కు వచ్చిన ఢోకా ఏమీ లేదంటూ పేర్కొనడం విశేషం.
Also Read : బీహార్ లో కొలువు తీరిన కొత్త కేబినెట్