Amit Shah : కేసీఆర్ ప్రభుత్వం కూలడం ఖాయం
కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా
Amit Shah : కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah) షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కూలడం ఖాయమని జోష్యం చెప్పారు.
అందుకే భారతీయ జనతా పార్టీలోకి కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి చేరారని అన్నారు. మునుగోడులో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఉప ఎన్నికలో రాజ గోపాల్ రెడ్డిని గెలిపించారని పిలుపునిచ్చారు అమిత్ చంద్ర షా. యావత్ దేశం మునుగోడు వైపు చూస్తోందని అన్నారు. కోమటిరెడ్డిని గెలిపిస్తే గులాబీ సర్కార్ కూలడం ఖాయమన్నారు.
సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. అబద్దాలు ప్రభుత్వం అంటూ అమిత్ షా దుయ్యబట్టారు. మరో వైపు ట్రబుల్ షూటర్ మజ్లిస్ పై మండిపడ్డారు. ఆ పార్టీకి భయంతోనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ జరపడం లేదంటూ నిప్పులు చెరిగారు.
పేదవారికి డబుల్ బెడ్ రూమ్ లు ఎవరికైనా ఇచ్చారా మునుగోడు ప్రజలారా అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు నెల నెలా రూ. 3 వేల పెన్షన్ ఇస్తానని చెప్పారు.
మరి మీకు అందుతున్నాయా అని నిలదీశారు. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామన్నారు. మీ జిల్లాల్లో స్పెషాలిటీ ప్రారంభం అయ్యిందా అని అన్నారు అమిత్ చంద్ర షా.
దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి అందిందా అన్నారు కేంద్ర మంత్రి. ఎందరో బలిదానాలు చేస్తే వచ్చిన తెలంగాణలో నిరుద్యోగాలకు ఒక్క జాబ్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు.
Also Read : మంత్రిని అనర్హుడిగా ప్రకటించలేం – హైకోర్టు