Revanth Reddy : కేసీఆర్ ఖేల్ ఖ‌తం కాంగ్రెస్ దే అధికారం

నిప్పులు చెరిగిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Revanth Reddy  : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మ‌రోసారి నిప్పులు చెరిగారు కేసీఆర్ పై. మాయ మాట‌లు చెప్ప‌డంలో ఆయ‌న‌ను మించిన నాయ‌కుడు లేరన్నారు.

ఉద్య‌మం పేరుతో అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు జ‌నాన్ని , రాష్ట్రాన్ని దోచుకోవ‌డంలో నెంబ‌ర్ వ‌న్ గా ఉంద‌న్నారు. ఎన్నుకున్న ప్ర‌జా ప్ర‌తినిధులు రాబందుల్లా త‌యారయ్యార‌ని ఏ ఒక్క దానినీ విడిచి పెట్ట‌డం లేద‌ని ఆరోపించారు.

నీళ్ల నిరంజ‌న్ రెడ్డి కాదు ఆయ‌న నోట్ల నిరంజ‌న్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ న‌యా పైసాకు కూడా కొర‌గాడ‌ని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్ర‌జ‌లు కేసీఆర్ ను సాగ‌నంపేందుకు రెడీగా ఉన్నార‌ని జోస్యం(Revanth Reddy )చెప్పారు.

ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలోని కొల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో మ‌న ఊరు మ‌న పోరు కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌కు భారీ ఎత్తున జ‌నం హాజ‌ర‌య్యారు.

అశేష జ‌న‌వాహినిని చూస్తుంటే కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌న్నారు. త‌మ పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన వెంట‌నే 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌న్నారు. అణ‌గారిన వ‌ర్గాల అభ్యున్న‌తికి పాటు ప‌డ‌తామ‌న్నారు.

ఎంద‌రో మ‌హ‌నీయుల‌ను అందించిన ప్రాంతం న‌ల్ల‌మ‌ల అని కొనియాడారు. తాను కూడా ఈ ప్రాంతానికి చెందిన వాడిన‌ని మీరంతా త‌మ పార్టీని ఆశీర్వ‌దించాల‌ని కోరారు రేవంత్ రెడ్డి(Revanth Reddy ).

అంత‌కు ముందు మాజీ మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడు నాగం జ‌నార్ద‌న్ రెడ్డి మాట్లాడుతూ పాల‌మూరు జిల్లాకు నీటి ప‌రంగా ఎంత అన్యాయం జ‌రిగిందో వివ‌రించారు.

మ‌రో సీనియ‌ర్ నాయ‌కుడు చిన్నారెడ్డి నిరంజ‌న్ రెడ్డిని టార్గెట్ చేశారు. సంప‌త్ సైతం యూత్ ను అభినందించారు.

Also Read : పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం స‌ర్కార్ పై పోరాటం

Leave A Reply

Your Email Id will not be published!