Keerthy Suresh : సినిమా చూశాక క‌ళావ‌తిగా గుర్తిస్తారు

ప‌రుశురామ్ గారికి చాలా థ్యాంక్స్

Keerthy Suresh : ప్రిన్స్ మ‌హేష్ బాబుతో క‌లిసి కీర్తి సురేష్ ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కార్ వారి పాట న‌టించింది. ఈ మూవీ ఈనెల 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే మూవీ మేక‌ర్స్ ప్ర‌య‌త్నాల‌లో మునిగి పోయారు.

ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో భారీ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు న‌టి కీర్తి సురేష్‌(Keerthy Suresh). ఆమె సినిమా చేస్తున్న స‌మ‌యంలో క‌లిగిన అనుభ‌వాల‌ను పంచుకున్నారు.

త‌న సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచి పోవ‌డం ఖాయ‌మ‌న్నారు. ఇక సెట్స్ లో మ‌హేష్ బాబు చాలో జోవియ‌ల్ గా ఉంటారు. ఆయ‌నతో చేస్తున్న‌ప్పుడు చాలా కంఫ‌ర్ట్ జోన్ లో ఉన్నాన‌ని అనిపించింద‌ని తెలిపింది కీర్తి సురేష్‌.

మా ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ పండింద‌ని చెప్పింది. ఇక త‌న‌కు క‌ళావ‌తి పాత్ర‌ను ఇచ్చినందుకు ప్ర‌ధానంగా ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ కు థ్యాంక్స్ చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది కీర్తి సురేష్‌(Keerthy Suresh).

అభిమానులు సినిమా చూశాక త‌న‌ను కీర్తి సురేష్(Keerthy Suresh) గా కంటే క‌ళావ‌తిగానే గుర్తు పెట్టుకుంటార‌ని చెప్పింది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌న్నీ హిట్ గా నిలిచాయి. సంగీతం అందించిన థ‌మ‌న్ గారికి రుణ‌ప‌డి ఉన్నానని తెలిపింది.

ఇక ప్రిన్స్ మ‌హేష్ బాబు గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొంది కీర్తి సురేష్. న‌న్ను ఇప్ప‌టి వ‌ర‌కు సావిత్రి మ‌హానటిగా చూశారు. కానీ ఇప్పుడు క‌ళావ‌తి తో పిలుస్తార‌ని చెప్పింది.

ఇక మ‌హేష్ బాబు లాంటి స్టార్ తో న‌టించ‌డం మొద‌ట్లో భ‌యం వేసింది. ఆ త‌ర్వాత అల‌వాటై పోయింద‌న్నారు. న‌మ్ర‌త రియ‌ల్ క‌ళావ‌తి అని కితాబు ఇచ్చారు.

 

Also Read : పుష్ప సాంగ్ ఎఫెక్ట్ ప్రిన్సిపాల్ స‌స్పెండ్

Leave A Reply

Your Email Id will not be published!