MP Sanjay Singh : కేజ్రీవాల్ ఎవ‌రికీ త‌ల‌వంచ‌డు – ఎంపీ

ఈ దేశంలో ఇద్ద‌రు రాజులు ఉన్నారు

MP Sanjay Singh : ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసుకు సంబంధించి ఆప్ క‌న్వీన‌ర్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ స‌మ‌న్లు జారీ చేసింది. ఇవాళ హాజ‌రు కావాల‌ని ఆదేశించ‌డంతో భారీ బందోబ‌స్తు మ‌ధ్య సీబీఐ ఆఫీసుకు చేరుకున్నారు సీఎం. ఆప్ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు చేరుకున్నారు. ఆందోళ‌న‌, నిర‌స‌న‌లు చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా ఎంపీ సంజ‌య్ సింగ్(MP Sanjay Singh) నిప్పులు చెరిగారు.

ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దేశానికి విద్య‌, ఆరోగ్య న‌మూనా అందించినందుకు శిక్ష అనుభ‌విస్తున్నాడ‌ని అన్నారు. కేంద్రం కావాల‌ని ఆయ‌న‌ను ఇరికించాల‌ని చూస్తోంద‌ని ఆరోపించారు. ఈ అణ‌చివేతకు వ్య‌తిరేకంగా ఆప్ ఎక్క‌డా త‌గ్గ‌ద‌ని , నిరంత‌రం పోరాటం చేస్తూనే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఆప్ స‌త్యం కోసం, ప్ర‌జ‌ల బాగు కోసం ప‌ని చేస్తుద‌ని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ఆప్ క‌న్వీన‌ర్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఎవరికీ త‌ల‌వంచ‌డని అన్నారు. నియంతృత్వానికి వ్య‌తిరేకంగా పోరాటం సాగిస్తాడ‌ని చెప్పారు ఎంపీ సంజ‌య్ సింగ్(MP Sanjay Singh). ఈ దేశంలో ఇద్ద‌రు రాజులు ఉన్నార‌ని, ఒక‌రు మోదీ నియంత అని మ‌రొక‌రు అమిత్ షా అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Also Read : ఖాకీల స‌మ‌క్షంలోనే చంపేస్తారా

Leave A Reply

Your Email Id will not be published!