Mahua Moitra Priyanka : ‘ప‌ద బంధం’పై ఎంపీల కామెంట్స్

సోష‌ల్ మీడియాలో వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం

Mahua Moitra Priyanka : టీఎంసీ ఎంపీ మ‌హూవా మోయిత్రా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. గురువారం ఎంపీ చేసిన ట్వీట్ క‌ల‌క‌లం రేపింది. అన్ పార్ల‌మెంట‌రీ ప‌దాలు వాడ‌కూడ‌దంటూ పార్ల‌మెంట్ బులిటెన్ విడుద‌ల చేసింది.

అభ్యంత‌ర‌క‌ర వ‌ర్డ్స్ వాడితే క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది. దీనిపై స్పందించారు మ‌హూవా మోయిత్రా(Mahua Moitra). ఆమెతో పాటు శివ‌సేన ఎంపీ ప్రియాంక చ‌తుర్వేది(Priyanka) సైతం వాహ్ మోదీజీ వాహ్ అంటూ ఎద్దేవా చేశారు.

ఇదే స‌మ‌యంలో తృణ‌మూల్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ కూడా మండిప‌డ్డారు కేంద్ర స‌ర్కార్ పై. ఇటీవ‌ల కాళీ పోస్ట‌ర్ పై తీవ్ర వివాదాన్ని ఎదుర్కొంటోంది మ‌హూవా. ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శించ‌కుండా ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌య‌త్నంగా ఆమె కొట్టి పారేశారు.

గ‌తంలో లోక్ స‌భ మాజీ స్పీక‌ర్ మీరా కుమార్ చేసిన ప్ర‌య‌త్నాన్ని ప్ర‌స్తావించారు ఎంపీ. బైత్ జాయే బైత్ జాయే ప్రేమ్ సే బోలియే జ‌బ్ తో స‌హా మూడు ట్వీట్ల‌ను తొల‌గించారు.

లోక్ స‌భ , రాజ్య స‌భ కోసం అన్ పార్ల‌మెంట‌రీ ప‌దాల కొత్త జాబితాలో బీజేపీ భార‌త దేశాన్ని ఎలా నాశ‌నం చేస్తుందో ఇదో ఉదాహ‌ర‌ణ అని పేర్కొన్నారు మ‌హూవా.

విచిత్రం ఏమిటంటే ప్ర‌తిపక్షాలు ఉపయోగించే అన్ని ప‌దాల‌ను తీసుకొని వాటిని నిషేధించింద‌ని టీఎంసీ ఎంపీ ఆరోపించారు. డెరెక్ ఓబ్రియ‌న్ ప్ర‌భుత్వానికి స‌వాల్ విసిరారు..

తాను అన్ పార్ల‌మెంట‌రీ గా భావించే అన్ని ప‌ద‌బంధాలు , ప‌దాల‌ను పూర్తిగా ఉప‌యోగించుకుంటాన‌ని ప్ర‌క‌టించాడు.జైరాం ర‌మేష్ కూడా మోదీ ప్ర‌భుత్వ వాస్త‌విక‌త‌ను వివ‌రించేందుకు ఉప‌యోగించే ప‌దాల‌ను నిరోధించార‌ని పేర్కొన్నారు ఎంపీలు.

Also Read : పార్ల‌మెంట్ లో నోరు జారితే జాగ్ర‌త్త

Leave A Reply

Your Email Id will not be published!