Kotamreddy Sridhar Reddy : సార్ సెక్యూరిటీ క‌ల్పించండి

అమిత్ షాకు ఎమ్మెల్యే కోటంరెడ్డి

Kotamreddy Sridhar Reddy : ఏపీలో రాజ‌కీయాలు ముదిరి పాకాన పడ్డాయి. ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతుంటే అధికారంలో ఉన్న వైసీపీకి చెందిన నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. ఆయ‌న స‌ర్కార్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఆపై ఎమ్మెల్యేనైన త‌న ఫోన్ ట్యాపింగ్ అవుతోందంటూ వాపోయారు.

వెంట‌నే దీనిపై విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌స్తుత స‌ర్కార్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి జ‌గ‌న్ రెడ్డి ప‌ట్ల సానుకూల‌త ప్ర‌ద‌ర్శించ‌డం విశేషం. కొంద‌రు త‌న‌ను కావాల‌ని బ‌ద్నాం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌భుత్వంపై నేరుగా ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తున్న కోటంరెడ్డికి కోలుకోలేని షాక్ ఇచ్చింది సర్కార్ .

ఆయ‌న‌కు న‌లుగురు గ‌న్ మెన్లు ఉండ‌గా ఇద్ద‌రిని స‌ర్కార్ తొల‌గించింది. ఇక త‌న‌కు మ‌రో ఇద్ద‌రు అవ‌స‌రం లేదంటూ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చానంటూ ప్ర‌క‌టించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy). ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి మ‌రో షాకింగ్ కామెంట్ చేశారు. త‌న‌కు , త‌న కుటుంబానికి వైసీపీ ప్ర‌భుత్వం నుంచి ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని వాపోయాడు.

ఆపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ప్ర‌స్తుతం ఇది క‌ల‌క‌లం రేపింది. అంతే కాకుండా ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంపై విచార‌ణ కూడా చేప‌ట్టాల‌ని కోరారు ఎమ్మెల్యే.

Also Read : క‌విత‌కు షాక్..బుచ్చిబాబు అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!