Sanjay Raut : సోమయ్యకు లీగల్ నోటీసులు పంపిస్తా – రౌత్
త్వరలో లీగల్ నోటీసులు పంపిస్తానన్న ఎంపీ
Sanjay Raut : భారతీయ జనతా పార్టీకి పదే పదే తమను టార్గెట్ చేయడం అలవాటుగా మారిందన్నారు శివసేన బాల్ ఠాక్రే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut). ఆయనపై బీజేపీకి చెందిన అగ్ర నాయకుడు కిరీట్ సోమయ్య సంచలన కామెంట్స్ చేశారు. కంపెనీ ఏర్పాటు కాక ముందే సంజయ్ రౌత్ భార్యకు కోవిడ్ -19 కేంద్రాల ఏర్పాటుకు బీఎంసీ కాంట్రాక్టు ఇచ్చిందంటూ ఆరోపించారు సోమయ్య.
దీనిపై సీరియస్ గా స్పందించారు ఎంపీ సంజయ్ రౌత్. తనపై కిరీట్ సోమయ్య చేసిన ఆరోపణలు పూర్తిగా సత్య దూరమైనవని పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా ఆరోపణలు చేస్తారంటూ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. త్వరలో కిరీట్ సోమయ్యకు , పార్టీకి చెందిన నాయకులకు లీగల్ నోటీసులు పంపిస్తానని హెచ్చరించారు.
దేశంలోనే అత్యంత ఆదాయం కలిగిన పౌర సంస్థగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పేరు పొందింది. మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కోవిడ్ -19 కేంద్రాలను ఏర్పాటు చేయడంలో అవకతవకలు జరిగాయంటూ బీజేపీ అగ్ర నేత కిరీట్ సోమయ్య సంచలన ఆరోపణలు చేశారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్యకు కంపెనీ లేకుండానే కట్టబెట్టారంటూ మండిపడ్డారు.
దీనిపై సీరియస్ గా స్పందించారు సంజయ్ రౌత్(Sanjay Raut). ఆయన చేసిన ఆరోపణలు అవాస్తవమని, త్వరలోనే సత్యం ఏమిటనేది తేలుతుందని స్పష్టం చేశారు శివసేన ఎంపీ. బీజేపికి చెందిన కిరీట్ సోమయ్య అలియాస్ పోపట్లాల్ నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. శివసేన నాయకులపై కావాలాని బురద చల్లుతున్నాడంటూ మండిపడ్డారు.
Also Read : కిరెన్’ కామెంట్స్ ‘కపిల్’ సీరియస్