Madhu Yashki Goud: ఎమ్మెల్సీ కవితపై మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ కవితపై మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
Madhu Yashki Goud : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కవిత పెద్ద లేడీ మాఫీయా డాన్ అని… తెలంగాణ జాగృతి సంస్థ పెద్ద అవినీతి సంస్థ అని ఆరోపించారు. అవినీతి సొమ్మును జాగ్రత్తగా కాపాడుకోవటానికే కవిత తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తోందని మధుయాష్కీ గౌడ్ విమర్శించారు.
Madhu Yashki Goud Slams
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని కవిత అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్, బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలో కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కవిత బీజేపీ వదిలిన బాణమని హాట్ కామెంట్స్ చేశారు. సోమవారం ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో మధుయాష్కీ గౌడ్ మాట్లాడారు. తెలంగాణకి కవిత కాంట్రిబ్యూషన్ ఏంటని మధుయాష్కీ గౌడ్ నిలదీశారు .
అవినీతి సొమ్మును జాగ్రత్తగా కాపాడుకోవటానికే కవిత తన తెలంగాణ జాగృతి సంస్థని బలోపేతం చేస్తోందని మధుయాష్కీ గౌడ్(Madhu Yashki Goud) విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల ఆదేశాల మేరకే కవిత పనిచేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వీక్ అయితే బీజేపీ లబ్ధి పొందుతుందని అన్నారు. తెలంగాణ రాక ముందు వసూళ్ల కోసం వాడుకున్న సంస్థ జాగృతి అని ఆరోపించారు. తెలంగాణ వచ్చాక రైతులకు సహాయం చేస్తామని చెప్పినా కవిత.. ఇప్పటిదాకా బీసీ, ఎస్సీలకు నయాపైసా సహాయం ఎందుకు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. బీసీల కోసం మాట్లాడుతున్న కవిత జాగృతిని బీసీల చేతిలో పెట్టాలని డిమాండ్ చేశారు మధుయాష్కీ గౌడ్.
కవిత లేడీ మాఫియా డాన్ అని మధుయాష్కీ గౌడ్(Madhu Yashki Goud) షాకింగ్ కామెంట్స్ చేశారు. కవిత చేయని దందా లేదని… చేయని స్కాం లేదని ఆరోపించారు. బతుకమ్మ పేరుతో కవిత బతుకనేర్చిందని ఎద్దేవా చేశారు. కేసుల నుంచి బయట పడాలంటే కవితకి బీజేపీ సహకారం అవసరమని అన్నారు. కవిత చాలా స్కాములు చేసిందని ఆరోపించారు. జీఎస్టీ, దొంగ నోట్ల స్కాముల్లో కవిత భాగస్వామి అని మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కవిత జాగృతి సంస్థపై విచారణ చేయాలని రేవంత్ ప్రభుత్వాన్ని మధుయాష్కీ గౌడ్ కోరారు. జాగృతి సంస్థ అవినీతి సంస్థ అని ఆరోపించారు. రాజీవ్ ప్రతాప్ కేంద్రమంత్రిగా స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని రూ.800 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. జాగృతి కోసం ఫీనిక్స్ లాంటి సంస్థల నుంచి కవిత డబ్బులు వసూల్ చేశారని ఆక్షేపించారు. జై తెలంగాణ అని పిడికిలి బిగించి దోచుకున్నది కేసీఆర్ ఫ్యామిలీనేనని ఆరోపణలు చేశారు. కవిత ఏ వ్యాపారంలో కోట్ల రూపాయలు సంపాదించిందని మధుయాష్కీ గౌడ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
Also Read : RBI : 2000 నోట్ల సేకరణపై ఆర్బీఐ కీలక అప్డేట్