Minister Gudivada Amarnath : కాంగ్రెస్ ఏపీని గొడ్డలితో నరికినట్టు విడదీసింది

మంత్రి గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు 6 వేలకు పైగా డీఎస్సీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు

Minister Gudivada : కాంగ్రెస్ పార్టీపై ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల క్రితం ఏపీని గొడ్డలితో నరికినట్టు విభజించారు అంటూ మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అప్పట్లో ఏపీ ప్రజల మనోభావాలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్రానికి స్వతంత్రం ఉందని, ఏపీకి ప్రత్యేక హోదా లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడి ప్రజల ఆదరణ కోల్పోవడానికి ఇదే కారణమన్నారు. ఇప్పుడు మళ్లీ వస్తూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కొత్త డ్రామాకు తెరలేపుతున్నారు.

Minister Gudivada Comments Viral

మంత్రి గుడివాడ అమర్ నాథ్(Gudivada Amarnath) మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు 6 వేలకు పైగా డీఎస్సీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. హామీని నెరవేర్చామని తేల్చిచెప్పారు. ఏపీ విభజన చేసిన జాతీయ కాంగ్రెస్ నేతలకు మంత్రులు , వైసీపీ నేతల ఇళ్లను ముట్టడించే హక్కు లేదన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ కాంగ్రెస్ నేతలు మంత్రుల ఇళ్లను ముట్టడించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ తీరును మంత్రి అమర్ నాథ్ తప్పు పట్టారు. చిల్లర కార్యక్రమాలు అమలు చేయడంపై ఆ పార్టీ నేతలపై మండిపడ్డారు.

Also Read : Best CM in India : దేశంలోనే నెంబర్ వన్ సీఎంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి

Leave A Reply

Your Email Id will not be published!