CM YS Jagan: రాప్తాడు వేదికగా టీడీపీ, జనసేన పార్టీలకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ !

రాప్తాడు వేదికగా టీడీపీ, జనసేన పార్టీలకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ !

CM YS Jagan: “వైనాట్ 175” నినాదంతో వచ్చే ఎన్నికల్లో మరల అధికారం సాధించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… నాయకులను, కార్యకర్తలను సమయాత్తం చేస్తున్నారు. వైసీపీ బలాన్ని… ప్రతిపక్షాలతో పాటు యావత్ ప్రపంచానికి తెలియజేసేలా ‘సిద్ధం’ పేరుతో రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే భీమిలి, దెందులూరు సభలు విజయవంతం కావడంతో…. ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో ‘సిద్ధం’ సభను నిర్వహించారు. ఈ సభకు రాయలసీయ నలుమూలల నుండి వచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలతో రాప్తాడు జనసంద్రాన్ని తలపించింది. దీనితో సిద్ధం సభ వేదికగా… విపక్ష కూటమిపై జగన్ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు.

CM YS Jagan  – ఫ్యాన్ ఇంట్లో… సైకిల్ బయట… గ్లాసు సింక్ లో ఉండాలి – జగన్

‘సిద్ధం’ సభ వేదికగా వైసీపీ శ్రేణులను ఉద్దేశ్యించి సీఎం జగన్ మాట్లాడుతూ… “ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతూ ఉండాలి… సైకిల్ ఎప్పుడూ ఇంటి బయట ఉండాలి… త్రాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలి…” అంటూ పంచ్ డైలాగ్ వేసారు. దీనితో సభ ఒక్కసారిగా దద్దరిల్లిపోవడమే కాకుండా… ప్రస్తుతం ఆ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో జరుగుతున్నది… విశ్వసనీయతకు, వంచనకు మధ్య యుద్ధం. కౌరవ సేన లాంటి టీడీపీ కూటమికి ఎదురుగా ఉన్నది అభిమన్యుడు కాదు గాండీవధారి అర్జునుడు అంటూ సెటైర్ వేసారు. ప్రస్తుతం సీఎం జగన్(CM YS Jagan) వేసిన పంచ్ డైలాగ్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సోషల్ మీడియలో ట్రెండింగ్ లో జగన్ ‘సిద్ధం’ సభ !

అనంతపురం జిల్లా రాప్తాడు వేదికగా ఆదివారం నిర్వహించిన ‘సిద్ధం’ సభ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్‌(ట్విట్టర్‌)లో దేశంలోనే మొదటిస్థానంలో సిద్ధం’ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. సిద్ధం అప్‌డేట్స్‌ను వైఎస్సార్‌సీపీ అభిమానులు భారీగా షేర్‌ చేస్తున్నారు. ‘సిద్ధం’ సభా ప్రాంగణం ఫొటోలతో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ నిండిపోయింది.

Also Read : Minister Gudivada Amarnath : కాంగ్రెస్ ఏపీని గొడ్డలితో నరికినట్టు విడదీసింది

Leave A Reply

Your Email Id will not be published!