Minister Nara Lokesh: పవన్‌  కల్యాణ్‌ కు ‘యువగళం’ పాదయాత్ర పుస్తకం అందజేసిన లోకేశ్‌

పవన్‌  కల్యాణ్‌ కు ‘యువగళం’ పాదయాత్ర పుస్తకం అందజేసిన లోకేశ్‌

Nara Lokesh : కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా… నేడు ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించింది. ఈ నేపథ్యంలో క్యాబినెట్‌ భేటీకి హాజరయ్యేందుకు సచివాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ను మంత్రి నారా లోకేశ్‌ కలిసారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందు తాను చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని పవన్‌ కల్యాణ్‌ కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌ను ఉపముఖ్యమంత్రి అభినందించారు. జగన్ రాక్షస పాలనపై సమర శంఖంలా యువగళం అంటూ యువగళం పుస్తకంపై పవన్ ప్రశంసలు కురిపించారు. అలాగే ఇతర మంత్రులకు కూడా మంత్రి లోకేష్ యువగళం పుస్తకాన్ని అందజేశారు.

Nara Lokesh Gives

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌  మాట్లాడుతూ నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యం చేయడంలో యువగళం పాదయాత్ర సఫలీకృతమైందన్నారు. నాటి అనుభవాలను కళ్లకు కట్టినట్లుగా పుస్తకరూపంలోకి తేవడంపై లోకేశ్‌ను ప్రశంసించారు. అరాచక పాలన అంతమై నేటికి ఏడాది పూర్తయిందని.. గత ప్రభుత్వ పీడకలను ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదన్నారు. ఈ సందర్భంగా నాటి యువగళం పాదయాత్ర అనుభవాలను పవన్‌తో లోకేశ్‌ పంచుకున్నారు.

Also Read : Botcha Satyanarayana: మాజీమంత్రి బొత్సకు అస్వస్థత ! “వెన్నుపోటు దినం”లో స్పృహ తప్పిన బొత్స !

Leave A Reply

Your Email Id will not be published!