Minister Ponnam : రవాణా శాఖలో మార్పులపై కీలక నిర్ణయం తీసుకున్న మంత్రి పొన్నం

ఆర్టీసీలో ఎంవీఐ రూల్స్ అమలు అవుతున్నాయి...

Minister Ponnam : రవాణా శాఖలో రెండు మూడు సంస్కరణలు తీసుకువస్తున్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మోటారు వాహన చట్టంలో భాగంగా దేశంలో 28 రాష్ట్రాలు ఇప్పటికే సారథి వాహన్ పోర్టల్ అమలు చేస్తున్నాయన్నారు. ఇంటర్ స్టేట్ రిలేషన్స్‌కు ఇబ్బంది వస్తుండడంతో క్షేత్ర స్థాయిలో ఆర్టీవో డీటీవోలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ కూడా సారథి ఈ వాహన పోర్టల్‌లో చేరుతున్నట్లు చెప్పారు. జీవో 28 ద్వారా ఇది అమలు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో, దేశంలో వాహనాలకు సంబంధించి 15 సంవత్సరాలు మనం వాడే వాహనాలు , 8 సంవత్సరాలు ప్రైవేట్ వాహనాలు స్క్రాపింగ్ పాలసీ తీసుకురావడం జరిగిందన్నారు.

Minister Ponnam Comment

కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో అమలవుతున్న పాలసీలు అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేసే దానిపై జీవో తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. వాహనాల చెకింగ్‌కు సరైన విధానం అమలు జరగడం లేదని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ తీసుకొస్తున్నామన్నారు. ఒక్కో సెంటర్‌కు రూ.8 కోట్లు ఖర్చు అవుతుందని… రాష్ట్రంలో 32 సెంటర్లు తీసుకొస్తున్నామని తెలిపారు. దేశ వ్యాప్తంగా సంవత్సరానికి లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో కూడా రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలుపై ప్రత్యేక నిబంధనలు తీసుకొస్తున్నామన్నారు. రోడ్డు భద్రతపై యునిసెఫ్ సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి పాఠశాలలో రోడ్డు సేఫ్టీపై అవగాహన కలిస్తున్నామని చెప్పారు. వచ్చే నెలలో రోడ్డు సేఫ్టీ మంత్ ఉందని.. సిగ్నల్, జీబ్రా క్రాసింగ్ తదితర అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటి వరకు 8 వేల లైసెన్స్2లు రద్దు చేయబడ్డాయన్నారు.

‘‘ప్రాణంపోతుంది.. ప్రాణం నుంచి రక్షించుకోవడానికి సుప్రీం కోర్టు నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం.. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం ఉండదు. వాహనాలు కొనుక్కున్నా… వారి పేరు మీద నమోదు చేసుకునే అవకాశం ఉండదు. ప్రాణ నష్టాన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం చిన్న పిల్లల స్థాయి నుంచి ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలి. ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ వాహనాలు, ఆర్టీసీ(RTC) బస్సులు, టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ వాహనాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. కొత్తగా 113 మంది వెహికిల్ ఇన్స్పెక్టర్లు నియామకాలు పూర్తి చేసుకొని విధుల్లోకి రాబోతున్నారు.. వారిని మరింతగా ఉపయోగించుకుంటాం.

ఆర్టీసీ(RTC)లో ఎంవీఐ రూల్స్ అమలు అవుతున్నాయి. ఎక్కడ ఇబ్బంది లేదు. జీహెచ్‌ఎంసీలో ఉన్న వాహనాలు అయినా ఏదైనా రూల్స్ పాటించాల్సిందే. ప్రభుత్వ వాహనాలకు కూడా నిబంధనలు వర్తిస్తాయి.. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన రవాణా శాఖ అంశాలు ఇరు రాష్ట్రాల అధికారులు చర్చిస్తారు. టీఎస్ నుంచి టీజీకి మారినప్పుడు.. టీఎస్ వాహనాలు మళ్లీ టీజీగా మారుతాయని చెప్పలేదు. కొత్త వాహనాలు టీజీగా వస్తున్నాయి. నిబంధనలు ఉల్లఘించి వాహనాలు లైసెన్స్ రద్దు అయితే వాళ్ళు వాహనాలు కొనడానికి ఉండదు.. వాహనాలు నడపడానికి ఉండదు. మా డిపార్ట్‌మెంట్ నుంచే కాకుండా యూనిసెఫ్ వారితో కూడా అవగాహన కల్పిస్తున్నాం’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) పేర్కొన్నారు.

Also Read : J&k Election Results 2024 : కాబోయే సీఎం ఎవరనేది క్లారిటీ ఇచ్చిన మాజీ సీఎం

Leave A Reply

Your Email Id will not be published!