Uday Samant : షిండే గ్రూప్ లో చేరిన మంత్రి సామంత్

శివ‌సేన పార్టీ చీఫ్ ఉద్ద‌వ్ ఠాక్రేకు షాక్

Uday Samant : మ‌హారాష్ట్ర సంక్షోభం కొన‌సాగుతున్న వేళ రోజు రోజుకు సీన్ మారుతోంది. ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూ స‌వాళ్లు విసురుతున్నారు.

శివ‌సేన‌పై తిరుగుబాటు జెండా ఎగుర వేసిన రాష్ట్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్ నాథ్ షిండే సార‌థ్యంలో ప‌లువురు ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు.

వారంతా ప్ర‌స్తుతం అస్సాం లోని గౌహ‌తి రాడిస‌న్ బ్లూ హోట‌ల్ లో బ‌స చేశారు. ఇప్ప‌టికే త‌మ‌కు 50 మందికి పైగా ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉంద‌ని ప్ర‌క‌టించారు దీప‌క్ కేస‌ర్క‌ర్.

ఆయ‌న‌ను త‌మ క్యాంపు ప్ర‌తినిధిగా నియ‌మించారు ఏక్ నాథ్ షిండే. ఎప్ప‌టిక‌ప్పుడు క్యాంపులో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల గురించి తెలియ చేస్తూ వ‌స్తున్నారు.

ఇదిలా ఉండ‌గా ఊహించ‌ని రీతిలో మ‌రో షాక్ త‌గిలింది శివ‌సేన పార్టీ చీఫ్ ఉద్ద‌వ్ ఠాక్రేకు. త‌న మంత్రివ‌ర్గంలో ఉన్న మ‌రో మంత్రి ఉద‌య్ స‌మంత్(Uday Samant) గుడ్ బై చెప్పారు.

ఆయ‌న గౌహ‌తి హోట‌ల్ లో సోమ‌వారం ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. స‌మంత్ ఏక్ నాథ్ షిండేతో ఆలింగ‌నం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా శివ‌సేన పార్టీ అధికార ప్ర‌తినిధి, రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

గౌహ‌తిలో ఉంటూ ఎంత కాలం రాజ‌కీయం చేస్తారంటూ ప్ర‌శ్నించారు. ద‌మ్ముంటే మ‌రాఠాలో కాలు మోపాల‌ని ఆ త‌ర్వాత సీన్ ఎలా ఉంటుందో చూస్తార‌ని స‌వాల్ విసిరారు.

బాలా సాహెబ్ ఠాక్రేను వ్య‌తిరేకించిన వాళ్లంతా చ‌ని పోయిన వాళ్లేన‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

Also Read : బీజేపీ పాల‌న‌లో డెమోక్ర‌సీ మ‌ర్డ‌ర్ – అఖిలేష్

Leave A Reply

Your Email Id will not be published!