MLA Mahipal Reddy : ఎట్టకేలకు కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

మహిపాల్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరగా....

MLA Mahipal Reddy : బీఆర్‌ఎస్‌కు మరో భారీ షాక్ తగిలింది. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయన కొద్ది రోజులుగా కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే స్థానిక నేతల నుంచి వ్యతిరేకత రావడంతో వాయిదా వేశారు. ఈ రోజు (శనివారం) మధ్యాహ్నం ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కలిసిన సందర్భంగా స్థానిక నేతలకు దానం నచ్చచెప్పారు..కాంగ్రెస్‌లో చేరేందుకు మార్గం సుగమం చేశారు.

MLA Mahipal Reddy Joined

మహిపాల్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరగా.. శుక్రవారం సాయంత్రం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సభకు వచ్చారు. ఈరోజు అసెంబ్లీలో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అలికెపూడి గాంధీ, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఉన్నారు. రెండు రోజుల్లోనే ముగ్గురు ఎమ్మెల్యేలు చేరడం బీఆర్‌ఎస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Also Read : IPS Transfers: ఏపీలో 37 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ !

Leave A Reply

Your Email Id will not be published!