Avinash Reddy CBI : సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి
మాజీ మంత్రి వివేకానంద హత్య కేసు
Avinash Reddy CBI : తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి శనివారం సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే తన తల్లికి తీవ్ర అనారోగ్యం ఉందని తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వ వద్దంటూ దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కూతురు సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు కేసును వాయిదా వేసింది. కొంత ఊరటనిచ్చింది ఎంపీకి. అయితే ఈ కేసుకు సంబంధించి సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది. అవినాష్ రెడ్డి(Avinash Reddy) విచారణకు సహకరించడం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది.
తన తల్లికి అనారోగ్యం కారణంగా కర్నూలు ఆస్పత్రిలో చేర్చామని, అందువల్ల తాను విచారణకు హాజరు కావడం లేదని సీబీఐకి, కోర్టుకు విన్నవించారు. ఎలాగైనా సరే విచారణకు హాజరు కావాల్సిందేనంటూ ఆదేశించింది కోర్టు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ముందుకు హాజరయ్యారు ఎంపీ అవినాష్ రెడ్డి.
Also Read : Nazam Sethi : ప్రభుత్వ నిర్ణయం మీదే భారం