Vijaya Sai Reddy : రాష్ట్రానికి స‌హకారం అభివృద్దికి సోపానం

మోదీకి విజ‌య సాయి రెడ్డి విన్న‌పం

Vijaya Sai Reddy : వైఎస్సార్సీపీ ఎంపీ, జాతీయ అధికార ప్ర‌తినిధి విజ‌య సాయి రెడ్డి ఇవాళ మ‌ర్యాద పూర్వ‌కంగా దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మోదీకి ఊహించ‌ని జ్ఞాపిక‌ను అంద‌జేశారు.

ప్ర‌ధానిని శాలువాతో స‌త్క‌రించ‌డ‌మే కాకుండా ఆక‌ట్టుకునే వినాయ‌కుడి విగ్ర‌హాన్ని ఇచ్చారు. దీంతో మోదీ ఆనందానికి లోన‌య్యారు. ఆయ‌న‌కు గ‌ణ‌నాథుడంటే వ‌ల్ల‌మాలిన అభిమానం.

ఆ ప్ర‌తిమ‌ను చూసి అభినందించారు ఎంపీ విజ‌య సాయి రెడ్డిని(Vijaya Sai Reddy). ఈ సంద‌ర్భంగా కొద్ది సేపు ప్ర‌ధానితో ముచ్చ‌టించారు. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌ను ఏక‌రువు పెట్టారు.

చాలా వాటికి ఇంకా ప‌రిష్కారం ల‌భించ‌లేద‌ని పేర్కొన్నారు. ఏపీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ఫోక‌స్ పెట్టాల‌ని, వెంట‌నే నిధులు మంజూరు చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు విజ‌య‌సాయి రెడ్డి(Vijaya Sai Reddy).

ప్ర‌త్యేకించి ఏపీకి కేంద్రం త‌గిన రీతిలో స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని విన్న‌వించారు . ఇందుకు సంబంధించి ఎంపీ విజ‌య సాయి రెడ్డి త‌న అధికారిక ట్విట్ట‌ర్ వేదిక‌గా ఇవాళ మోదీతో క‌లిసిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు.

ప్ర‌స్తుతం ఆయ‌న షేర్ చేసిన ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఆక‌ట్టుకునేలా ఉన్న వినాయ‌కుడి బొమ్మ హైలెట్ గా మారింది. ఏపీకి రావాల్సిన నిధులు, హామీల గురించి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీతో చ‌ర్చించిన‌ట్లు వెల్ల‌డించారు విజ‌య సాయి రెడ్డి.

ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం ఎంపీ మోదీని క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. కాగా రాజ‌కీయ వ‌ర్గాల‌లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read : ఆయుష్మాన్ ప‌థ‌కం రోగుల పాలిట శాపం

Leave A Reply

Your Email Id will not be published!