MS Dhoni : ధోనీ..ఓం ఫినిష్యాయ‌ న‌మః

ట్విట్ట‌ర్ లో ఎంఎస్ పై ప్ర‌శంస‌

MS Dhoni  : ఓం ఫినిష్యాయ‌ న‌మః ఏమిట‌ని అనుకుంటున్నారా. ఇప్పుడు ఈ కొత్త ప‌దం ట్విట్ట‌ర్ ను ఊపేస్తోంది. నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ప్ర‌పంచ క్రికెట్ లో బెస్ట్ ఫినిష‌ర్ గా పేరొందారు భార‌త క్రికెట్ జ‌ట్టుకు ఎన‌లేని విజ‌యాలు అందించిన మ‌హేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni ).

మ‌రోసారి తన‌లో చేవ త‌గ్గ‌లేద‌ని , స‌త్తా మిగిలే ఉంద‌ని నిరూపించాడు ఈ జార్ఖండ్ డైన‌మెట్. ఐపీఎల్ 2022లో భాగంగా ముంబై వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో ఓడి పోతుంద‌ని అనుకున్న త‌న సీఎస్కే జ‌ట్టుకు విజ‌యం క‌ట్ట‌బెట్టాడు.

ఇది ఊహించ‌ని ప‌రిణామం. ధోనీ ఆడిన తీరుకు మ‌రోసారి ప్ర‌పంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు జ‌య‌హో ధోనీ అంటున్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ధోనీ ఆడిన తీరుకు ఫిదా అవుతున్నారు. ఇందుకు ధోనీ (MS Dhoni )ఆట తీరుకు ఓం ఫినిషియా న‌మః అని కొత్త పేరు పెట్టారు. మ్యాచ్ లో భాగంగా ఆఖ‌రు ఓవ‌ర్ లో 17 ర‌న్స్ అవ‌స‌రప‌డ్డాయి.

ధోనీ మైదానంలో నిల‌బ‌డి ప‌ని పూర్తి కానిచ్చేశాడు. చెన్నై జ‌ట్టుకు విజ‌యం సాధించి పెట్టాడు. 13 బంతులు ఎదుర్కొన్న ధోనీ 28 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

ఇక ఆఖ‌రి ఓవ‌ర్ వేసిన ఉనాద్క‌త్ ను ఉతికేశాడు ధోనీ. దీంతో మ‌రోసారి తాను ఫైన‌ల్ ఫినిష‌ర్ నంటూ నిరూపించుకున్నాడు, ఎంఎస్ ఆట తీరుపై తాజా, మాజీ ఆట‌గాళ్లు ప్ర‌శంస‌లతో ముంచెత్తారు.

ది గ్రేటెస్ట్ లాస్ట్ ఓవ‌ర్ హిట్ట‌ర్ ఆఫ్ ఆల్ టైమ్ అని మైఖేల్ వాన్ పేర్కొన్నాడు. ఎంఎస్ ధోనీ ఓం ఫినిష్యాయ న‌మః వాట్ ఏ విన్ రొంబ న‌ల్లా అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ప‌లువురు దిగ్గ‌జ ఆట‌గాళ్లు ధోనీకి కితాబు ఇచ్చారు.

Also Read : పొలార్డ్ పాదాల‌ను తాకిన బ్రావో

Leave A Reply

Your Email Id will not be published!